Anthony Albanese: బాండీ బీచ్ కాల్పుల ఘటన దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి: ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్
- ఆస్ట్రేలియా సిడ్నీలో కాల్పుల కలకలం
- బాండీ బీచ్ వద్ద ఘటనలో 10 మంది మృతి
- షాకింగ్ ఘటనగా అభివర్ణించిన ప్రధాని అల్బనీస్
- యూదు వ్యతిరేక దాడిగా ఇజ్రాయెల్, యూదు సంఘాల ఆరోపణ
- ఒక షూటర్ హతం.. మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండీ బీచ్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ దృశ్యాలు అత్యంత షాకింగ్గా, కలవరపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించారు.
"బాండీలో చోటుచేసుకున్న దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా, కలచివేస్తున్నాయి. ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే ఏఎఫ్పీ కమిషనర్తో, ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్తో మాట్లాడాను. మేము ఎన్ఎస్డబ్ల్యూ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాము. మరింత సమాచారం ధ్రువీకరించుకున్న తర్వాత పూర్తి వివరాలు అందిస్తాము. పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్ఎస్డబ్ల్యూ పోలీసుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ కాల్పుల్లో మరో 12 మంది గాయపడ్డారు. యూదుల ప్రార్థనా సమావేశం సమీపంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా, వారిలో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన రెండో షూటర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు సూచించారు. అక్కడ ఓ బాంబు ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.
ఈ దాడి యూదు వ్యతిరేక చర్యేనని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేకత పెరిగిపోవడమే ఈ ఘటనకు కారణమని ఆయన అన్నారు. యూదు సమాజ రక్షణలో అల్బనీస్ ప్రభుత్వం విఫలమైందని ఆస్ట్రేలియన్ జూయిష్ అసోసియేషన్ సీఈఓ రాబర్ట్ గ్రెగొరీ విమర్శించారు. ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"బాండీలో చోటుచేసుకున్న దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా, కలచివేస్తున్నాయి. ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే ఏఎఫ్పీ కమిషనర్తో, ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్తో మాట్లాడాను. మేము ఎన్ఎస్డబ్ల్యూ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాము. మరింత సమాచారం ధ్రువీకరించుకున్న తర్వాత పూర్తి వివరాలు అందిస్తాము. పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్ఎస్డబ్ల్యూ పోలీసుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ కాల్పుల్లో మరో 12 మంది గాయపడ్డారు. యూదుల ప్రార్థనా సమావేశం సమీపంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా, వారిలో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన రెండో షూటర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు సూచించారు. అక్కడ ఓ బాంబు ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.
ఈ దాడి యూదు వ్యతిరేక చర్యేనని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేకత పెరిగిపోవడమే ఈ ఘటనకు కారణమని ఆయన అన్నారు. యూదు సమాజ రక్షణలో అల్బనీస్ ప్రభుత్వం విఫలమైందని ఆస్ట్రేలియన్ జూయిష్ అసోసియేషన్ సీఈఓ రాబర్ట్ గ్రెగొరీ విమర్శించారు. ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.