Narendra Modi: అక్కడ మోదీ వ్యతిరేక నినాదాలతో మాకు సంబంధం లేదు: కాంగ్రెస్
- ఢిల్లీలో కాంగ్రెస్ 'ఓట్ల చోరీ' నిరసన
- ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద నినాదాలు
- మోదీ సమాధి తవ్వుతాం అంటూ నినాదాలు
- స్లోగన్స్తో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్
- అది బీజేపీ పనేనంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన 'ఓట్ల చోరీ' నిరసన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొందరు కార్యకర్తలు అనుచిత నినాదాలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. అయితే, ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఎన్నికలను తారుమారు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు "మోదీ తేరీ కబ్ర ఖుదేగీ, ఆజ్ నహీ తో కల్ ఖుదేగీ" (మోదీ నీ సమాధి తవ్వుతాం, ఈ రోజు కాకపోతే రేపు) అంటూ నినాదాలు చేశారు. దీంతో పాటు "ఓట్ల దొంగ.. గద్దె దిగు" అంటూ కూడా స్లోగన్స్ వినిపించాయి.
ఈ నినాదాలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ మాట్లాడుతూ.. "అవి పార్టీ అధికారిక నినాదాలు కావు. అవగాహన లేని కొందరు కార్యకర్తలు అలా చేసి ఉండొచ్చు. 'ఓట్ల దొంగ.. గద్దె దిగు' అన్నదే మా అసలు నినాదం," అని వివరించారు.
మరో సీనియర్ నేత నానా పటోలే మరో అడుగు ముందుకేసి, ఇది బీజేపీ కుట్ర అయి ఉండొచ్చని ఆరోపించారు. "ఇలాంటి నినాదాలు కాంగ్రెస్ పార్టీ నుంచి రావు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే బీజేపీ తమ వాళ్లను పంపి ఇలాంటి నినాదాలు చేయించి ఉండొచ్చు. 'ఓట్ల దొంగ.. గద్దె దిగు' అనే నినాదాన్ని రాహుల్ గాంధీ ఇచ్చారు. మిగతా వాటితో మాకు సంబంధం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఎన్నికలను తారుమారు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు "మోదీ తేరీ కబ్ర ఖుదేగీ, ఆజ్ నహీ తో కల్ ఖుదేగీ" (మోదీ నీ సమాధి తవ్వుతాం, ఈ రోజు కాకపోతే రేపు) అంటూ నినాదాలు చేశారు. దీంతో పాటు "ఓట్ల దొంగ.. గద్దె దిగు" అంటూ కూడా స్లోగన్స్ వినిపించాయి.
ఈ నినాదాలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ మాట్లాడుతూ.. "అవి పార్టీ అధికారిక నినాదాలు కావు. అవగాహన లేని కొందరు కార్యకర్తలు అలా చేసి ఉండొచ్చు. 'ఓట్ల దొంగ.. గద్దె దిగు' అన్నదే మా అసలు నినాదం," అని వివరించారు.
మరో సీనియర్ నేత నానా పటోలే మరో అడుగు ముందుకేసి, ఇది బీజేపీ కుట్ర అయి ఉండొచ్చని ఆరోపించారు. "ఇలాంటి నినాదాలు కాంగ్రెస్ పార్టీ నుంచి రావు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే బీజేపీ తమ వాళ్లను పంపి ఇలాంటి నినాదాలు చేయించి ఉండొచ్చు. 'ఓట్ల దొంగ.. గద్దె దిగు' అనే నినాదాన్ని రాహుల్ గాంధీ ఇచ్చారు. మిగతా వాటితో మాకు సంబంధం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.