Narges Mohammadi: ఇరాన్ లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అరెస్ట్
- నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మది మళ్లీ అరెస్ట్
- ఇరాన్లో మరోసారి మహిళా హక్కుల కార్యకర్తపై ఉక్కుపాదం
- పెరోల్పై బయట ఉన్న ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మొహమ్మదిని స్థానిక పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవల మరణించిన ఓ మానవ హక్కుల న్యాయవాది స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె మద్దతుదారులు, సంబంధిత స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. అయితే, ఆమె అరెస్టుపై ఇరాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
మహిళల హక్కుల కోసం, ఇరాన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నర్గెస్ మొహమ్మది మూడు దశాబ్దాలకు పైగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె అనేకసార్లు జైలుకు వెళ్లారు, కఠిన శిక్షలు అనుభవించారు, కొరడా దెబ్బలు కూడా తిన్నారు. ఆమె అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ పురస్కారం ప్రకటించే సమయానికి కూడా ఆమె జైల్లోనే ఉండటం గమనార్హం.
వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమెకు, అనారోగ్య కారణాల రీత్యా డిసెంబర్ 2024లో పెరోల్ మంజూరైంది. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా ఆమె పెరోల్ కొనసాగింది. ఈ సమయంలో కూడా ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తాజా అరెస్టుతో ఆమె స్వేచ్ఛకు మళ్లీ సంకెళ్లు పడినట్లయింది.
మహిళల హక్కుల కోసం, ఇరాన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నర్గెస్ మొహమ్మది మూడు దశాబ్దాలకు పైగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె అనేకసార్లు జైలుకు వెళ్లారు, కఠిన శిక్షలు అనుభవించారు, కొరడా దెబ్బలు కూడా తిన్నారు. ఆమె అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ పురస్కారం ప్రకటించే సమయానికి కూడా ఆమె జైల్లోనే ఉండటం గమనార్హం.
వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమెకు, అనారోగ్య కారణాల రీత్యా డిసెంబర్ 2024లో పెరోల్ మంజూరైంది. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా ఆమె పెరోల్ కొనసాగింది. ఈ సమయంలో కూడా ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తాజా అరెస్టుతో ఆమె స్వేచ్ఛకు మళ్లీ సంకెళ్లు పడినట్లయింది.