Chandrababu Naidu: ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష... సేకరణ పెరగడంపై సంతృప్తి

Chandrababu Naidu Reviews Paddy Procurement in Andhra Pradesh
  • ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • గత ఏడాదితో పోలిస్తే 32 శాతం పెరిగిన ధాన్యం సేకరణ
  • ఇప్పటివరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
  • కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు రూ.4085 కోట్ల చెల్లింపులు
  • ఈ ఏడాది 50.75 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయం
రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరిగాయని, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రాల్లో 7.89 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. వేగంగా చెల్లింపులు జరపడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మొత్తం 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Paddy Procurement
Rice Procurement
Achannaidu
Nadendla Manohar
Agriculture Department
Civil Supplies Department
AP Government
Farmers Welfare

More Telugu News