Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సదస్సు గ్రాండ్ సక్సెస్.. అంచనాలకు మించి రెట్టింపు పెట్టుబడులు!
- రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు
- ఒక్క హరిత ఇంధన రంగంలోనే దాదాపు రూ.3 లక్షల కోట్లు
- లక్షలాది కొత్త ఉద్యోగాల కల్పనకు బలమైన పునాది
- ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన సీఎం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ సదస్సు విజయవంతమైంది. ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా, దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడమే కాకుండా, లక్షలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది.
రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో తొలిరోజు రూ.2.43 లక్షల కోట్లు, రెండో రోజు రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడుల్లో సింహభాగం హరిత ఇంధన రంగానిదే కావడం విశేషం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.2.99 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఒక్క ఈ రంగంలోనే 1.61 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయి.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ 2047' పేరుతో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఆర్థిక, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని మూడు మూల స్తంభాలుగా పేర్కొంటూ రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. ప్రజలు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ఈ డాక్యుమెంట్ లక్ష్యమని సీఎం వివరించారు.
హరిత ఇంధనంతో పాటు ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, పర్యాటకం వంటి కీలక రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్రాకీ డీసీ పార్క్ రూ.70 వేల కోట్లతో డేటా పార్కును, బయోలాజికల్-ఈ, అరబిందో ఫార్మా, హెటిరో వంటి సంస్థలు వేల కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి. ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, సల్మాన్ఖాన్ ఫిలిం స్టూడియోల ఏర్పాటుకు ముందుకొచ్చారు. సదస్సులో గత పదేళ్ల పాలనపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా, కేవలం అభివృద్ధిపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించడం పట్ల రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో తొలిరోజు రూ.2.43 లక్షల కోట్లు, రెండో రోజు రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడుల్లో సింహభాగం హరిత ఇంధన రంగానిదే కావడం విశేషం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.2.99 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఒక్క ఈ రంగంలోనే 1.61 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయి.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ 2047' పేరుతో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఆర్థిక, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని మూడు మూల స్తంభాలుగా పేర్కొంటూ రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. ప్రజలు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ఈ డాక్యుమెంట్ లక్ష్యమని సీఎం వివరించారు.
హరిత ఇంధనంతో పాటు ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, పర్యాటకం వంటి కీలక రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్రాకీ డీసీ పార్క్ రూ.70 వేల కోట్లతో డేటా పార్కును, బయోలాజికల్-ఈ, అరబిందో ఫార్మా, హెటిరో వంటి సంస్థలు వేల కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి. ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, సల్మాన్ఖాన్ ఫిలిం స్టూడియోల ఏర్పాటుకు ముందుకొచ్చారు. సదస్సులో గత పదేళ్ల పాలనపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా, కేవలం అభివృద్ధిపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించడం పట్ల రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.