Sonia Gandhi: సోనియా గాంధీపై కంగనా రనౌత్ విమర్శలు... ప్రియాంక కౌంటర్
- పౌరసత్వానికి ముందే ఓటరు జాబితాలో సోనియా పేరు!
- ఈ వివాదంపై సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు
- సోనియా భారతీయులను, రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించలేదన్న కంగనా
- ఇది పూర్తిగా అబద్ధం, ఆధారాలున్నాయా అని ప్రశ్నించిన ప్రియాంక
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందక ముందే 1980లో ఆమె పేరు ఓటరు జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను 2026 జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
ఈ పరిణామంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ భారతీయులను, దేశ రాజ్యాంగాన్ని, నిబంధనలను ఎప్పుడూ గౌరవించలేదని ఆరోపించారు. "కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరు. వారు తమను తాము 'మహా గొప్పవారు', 'మహోన్నతులు' అనుకుంటారు. అందుకే ఎప్పుడూ చట్టాలను ఉల్లంఘిస్తారు. అప్పట్లో ఆమెకు ఎంతో పలుకుబడి, అధికారం ఉంది... నిబంధనలు పాటించకుండా ఓటరు జాబితాలో పేరు చేర్చుకున్నారు. ఇది భారతీయుల పట్ల ఆమెకున్న అగౌరవాన్ని చూపిస్తుంది" అని కంగనా వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. "ఈ ఆరోపణలకు వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఇవి పూర్తిగా అవాస్తవం. పౌరసత్వం పొందాకే ఆమె ఓటు వేశారు. దాదాపు 80 ఏళ్ల వయసులో ఉన్న ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారు" అని ప్రియాంక అన్నారు.
వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను గతంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా, ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చేందుకు పత్రాలను ఫోర్జరీ చేసి ఉంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ స్పందిస్తూ, "రోజుకొక డ్రామా సృష్టిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఆరోపణలు చేసేవారు కనీసం ఈ రోజైనా సిగ్గుపడాలి. ఇలాంటి చర్యలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారు?" అని ప్రశ్నించారు.
ఈ పరిణామంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ భారతీయులను, దేశ రాజ్యాంగాన్ని, నిబంధనలను ఎప్పుడూ గౌరవించలేదని ఆరోపించారు. "కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరు. వారు తమను తాము 'మహా గొప్పవారు', 'మహోన్నతులు' అనుకుంటారు. అందుకే ఎప్పుడూ చట్టాలను ఉల్లంఘిస్తారు. అప్పట్లో ఆమెకు ఎంతో పలుకుబడి, అధికారం ఉంది... నిబంధనలు పాటించకుండా ఓటరు జాబితాలో పేరు చేర్చుకున్నారు. ఇది భారతీయుల పట్ల ఆమెకున్న అగౌరవాన్ని చూపిస్తుంది" అని కంగనా వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. "ఈ ఆరోపణలకు వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఇవి పూర్తిగా అవాస్తవం. పౌరసత్వం పొందాకే ఆమె ఓటు వేశారు. దాదాపు 80 ఏళ్ల వయసులో ఉన్న ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారు" అని ప్రియాంక అన్నారు.
వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను గతంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా, ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చేందుకు పత్రాలను ఫోర్జరీ చేసి ఉంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ స్పందిస్తూ, "రోజుకొక డ్రామా సృష్టిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఆరోపణలు చేసేవారు కనీసం ఈ రోజైనా సిగ్గుపడాలి. ఇలాంటి చర్యలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారు?" అని ప్రశ్నించారు.