Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్: హైదరాబాద్లో పెట్టుబడుల జాతర.. పోటెత్తిన కంపెనీలు
- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు తొలిరోజే భారీ స్పందన
- రూ.2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు
- ట్రంప్ మీడియా, బ్రూక్ఫీల్డ్, విన్ గ్రూప్ నుంచి భారీ పెట్టుబడులు
- దావోస్ను హైదరాబాద్కు తీసుకొచ్చారంటూ ప్రశంసలు
- వివిధ రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులకు 35కు పైగా సంస్థలు ముందుకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' తొలిరోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు సుమారు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు దావోస్కు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే సంప్రదాయానికి భిన్నంగా, ఈసారి దావోస్నే హైదరాబాద్కు రప్పించడంలో రేవంత్ సర్కార్ విజయం సాధించిందని పారిశ్రామిక వర్గాలు ప్రశంసించాయి.
హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ సదస్సులో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన 'ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్' రూ.41 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాబోయే పదేళ్లలో తమ పెట్టుబడులను లక్ష కోట్లకు పెంచుతామని సంస్థ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ తెలిపారు. బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి గ్లోబల్ రీసెర్చ్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు రూ.75 వేల కోట్లు, విన్ గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.27,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించగా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి వంటి ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతను, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు.
ఇంధన రంగంలోనే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ రూ.15,000 కోట్లు, అపోలో మైక్రో సిస్టమ్స్ రూ.1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. అపోలో గ్రూప్ విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా, రిలయన్స్కు చెందిన వంతారా కొత్త జూ పార్క్ ఏర్పాటుకు అంగీకరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, విద్య, వైద్యం, పర్యాటకం వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. సదస్సుకు అనూహ్య స్పందన లభించడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ సదస్సులో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన 'ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్' రూ.41 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాబోయే పదేళ్లలో తమ పెట్టుబడులను లక్ష కోట్లకు పెంచుతామని సంస్థ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ తెలిపారు. బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి గ్లోబల్ రీసెర్చ్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు రూ.75 వేల కోట్లు, విన్ గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.27,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించగా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి వంటి ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతను, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు.
ఇంధన రంగంలోనే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ రూ.15,000 కోట్లు, అపోలో మైక్రో సిస్టమ్స్ రూ.1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. అపోలో గ్రూప్ విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా, రిలయన్స్కు చెందిన వంతారా కొత్త జూ పార్క్ ఏర్పాటుకు అంగీకరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, విద్య, వైద్యం, పర్యాటకం వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. సదస్సుకు అనూహ్య స్పందన లభించడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.