భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇవ్వాలి: చైనాకు భారత విదేశాంగ శాఖ గట్టి సందేశం
- చైనాకు, లేదా ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించే భారతీయులకు సూచనలు
- బీజింగ్ కూడా భారత ప్రయాణికుల విషయంలో సక్రమంగా వ్యవహరించాలని సందేశం
- ఏకపక్షంగా నిర్బంధించడం, వేధించడం చేయవద్దన్న విదేశాంగ శాఖ
చైనా విమానాశ్రయాల మీదుగా రాకపోకలు సాగించే భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఏకపక్షంగా నిర్బంధించడం, వేధించడం వంటి పనులను మానుకుంటుందని, అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనలను గౌరవిస్తుందని భావిస్తున్నామని తెలిపింది. చైనా ప్రయాణాల విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.