Shamshabad Airport: మూడు విమానాలకు బాంబు బెదిరింపులు .. శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం
- కన్నూర్, ఫ్రాంక్ఫర్ట్, లండన్ నుంచి వచ్చిన విమానాలకు బెదిరింపు
- ఈ-మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు
- బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు
- ఆగంతకుల కోసం సైబర్ క్రైమ్ విభాగం గాలింపు
హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. మూడు అంతర్జాతీయ విమానాలలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ రావడంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. కన్నూర్-హైదరాబాద్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్, లండన్-హైదరాబాద్ మార్గాల్లోని విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్ అందుకున్న వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది ఆ మూడు విమానాలు ల్యాండ్ అయిన వెంటనే తనిఖీలు చేపట్టారు.
వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాలలో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికుల లగేజీ, క్యాబిన్ బ్యాగులతో పాటు కార్గో విభాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కన్నూర్-హైదరాబాద్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్, లండన్-హైదరాబాద్ మార్గాల్లోని విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్ అందుకున్న వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది ఆ మూడు విమానాలు ల్యాండ్ అయిన వెంటనే తనిఖీలు చేపట్టారు.
వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాలలో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికుల లగేజీ, క్యాబిన్ బ్యాగులతో పాటు కార్గో విభాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.