Pawan Kalyan: మన దేశంలో హిందువులకే అవమానాలు: పవన్ కల్యాణ్ ఆవేదన
- తిరుప్పరన్కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు
- కోర్టులో గెలిచినా ఆచారాన్ని కోల్పోయామన్న పవన్
- హిందువులను చులకనగా చూస్తున్నారన్న ఆవేదన
- ఆలయాల నిర్వహణకు సనాతన ధర్మ రక్షా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
- కులం, ప్రాంతం పేరుతో విడిపోతే హిందూ ధర్మానికి నష్టమని వెల్లడి
భారతదేశంలో హిందువులు తమ మత విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయపోరాటాలు చేయాల్సి రావడం విచారకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఉన్నప్పటికీ, అధికారులు అడ్డుకోవడంపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా "సనాతన ధర్మ రక్షా బోర్డు"ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"తిరుప్పరన్కుండ్రం, ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మొదటిది. అక్కడ కార్తీక మాసంలో కొండపై దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సంప్రదాయం. ఈ రోజు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి, సంప్రదాయాలను పాటించడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం బాధాకరం, విచారకరం. ఒక నిర్ణయాత్మకమైన న్యాయపోరాటంలో గెలిచిన తర్వాత కూడా, భక్తులు తమ సొంత ఆస్తిపై ఒక చిన్న, శాంతియుతమైన ఆచారాన్ని కూడా పాటించలేకపోతే, ఇక ఈ దేశంలో వారికి రాజ్యాంగబద్ధమైన న్యాయం ఎక్కడ లభిస్తుంది?
భారతదేశంలోని హిందువులందరూ ఒక కఠోర నిజాన్ని అర్థం చేసుకోవాలి. దీపం వెలిగించే హక్కు మనకే ఉందని చెన్నై హైకోర్టు మొదట సింగిల్ జడ్జి ద్వారా, ఆ తర్వాత ఉన్నత ధర్మాసనం ద్వారా ధృవీకరించింది. చట్టపరంగా మనం గెలిచాం. కానీ ఆచరణలో మాత్రం సర్దుకుపోవాల్సి వచ్చింది.
మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏ మతపరమైన పండుగనైనా ఒక వారం ఆలస్యంగా జరుపుకోగలరా? ఒక పవిత్రమైన రోజు వేడుకను వేరే సమయానికి మార్చగలరా? లేదు. ఎందుకంటే మతపరమైన సమయం, క్యాలెండర్ల పవిత్రత చర్చించలేనివి.
అయినా సనాతన ధర్మానికి సంబంధించిన ఆ పవిత్రమైన కార్తీక దీపపు క్షణం దొంగిలించబడింది. అది శాశ్వతంగా మాయమైపోయింది. ఎందుకంటే హిందువులను చులకనగా తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, ఎన్జీవోలు, మేధావులమని చెప్పుకునే బృందాలు.. ఇలా ఎవరైనా సరే, నష్టాన్ని అంగీకరించి సర్దుకుపోయేది మాత్రం ప్రతిసారీ హిందువులే. మనం హక్కును సాధించుకున్నాం, కానీ ఆచారాన్ని కోల్పోయాం. ఈ పునరావృత, వ్యవస్థాగత తిరస్కరణ కారణంగా, కేవలం కోర్టు విజయాలు మాత్రమే కాకుండా అంతకుమించి డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది. భక్తులే తమ దేవాలయాలు, మతపరమైన వ్యవహారాలను చురుకుగా నిర్వహించే 'సనాతన ధర్మ రక్షా బోర్డు' మనకు అవసరం.
హిందూ సంప్రదాయాలను, ఆచారాలను అపహాస్యం చేయడం కొన్ని సమూహాలకు పరిపాటిగా మారింది. ఇతర మతాల కార్యక్రమాల విషయంలో వారు అదే ధైర్యం చేయగలరా?
హిందువులకు ఆర్టికల్ 25 ప్రాథమిక హక్కు కాకుండా, ఐచ్ఛిక హక్కుగా మారిందా? ఒక పోలీస్ కమిషనర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ నిర్దిష్ట హైకోర్టు ఆదేశాలను ఏకపక్షంగా రద్దు చేయగలరా? చట్టబద్ధమైన భూమిలో దీపం వెలిగించడం 'హానిచేయని మతపరమైన చర్య' అని హైకోర్టు నిర్ధారించినప్పుడు, ఈ ఆచారం మత సామరస్యానికి ముప్పు అని ఎవరు, ఏ చట్టపరమైన యంత్రాంగం ద్వారా నిర్ణయిస్తారు? హిందూ మత సంస్థల శాఖ (HR&CE) అధికారులు నిలకడగా హిందూ భక్తుల ప్రయోజనాలకు, ఆలయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వారెలా జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటున్నారు?
మతపరమైన సమస్యలు తలెత్తినప్పుడు అబ్రహామిక్ మతాలను (అరేబియా మూలాలున్న మతాలు) అనుసరించేవారిలో ఉన్న ఐక్యతా స్ఫూర్తిని, సంఘీభావాన్ని హిందువులు గమనించాలి. వారు తమ విశ్వాసం కోసం జాతి, ప్రాంతీయ, భాషా భేదాలను అధిగమిస్తారు.
హిందువులు కులం, ప్రాంతం, భాషా అడ్డంకులతో విడిపోయి ఉన్నంత కాలం, హిందూ మతం, దాని ఆచారాలపై అపహాస్యాలు, అవమానాలు కొనసాగుతూనే ఉంటాయి. మన దేశంలోని హిందువులు హిందూ ధర్మం (తమిళంలో ఆరం) స్ఫూర్తితో ఒక ఉమ్మడి కనీస కార్యక్రమం కింద ఏకం కాకపోతే, ఈ స్ఫూర్తి నశించిపోతుంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారక వరకు ఉన్న ప్రతి హిందువు తమ సొంత గడ్డపై హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
"తిరుప్పరన్కుండ్రం, ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మొదటిది. అక్కడ కార్తీక మాసంలో కొండపై దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సంప్రదాయం. ఈ రోజు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి, సంప్రదాయాలను పాటించడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం బాధాకరం, విచారకరం. ఒక నిర్ణయాత్మకమైన న్యాయపోరాటంలో గెలిచిన తర్వాత కూడా, భక్తులు తమ సొంత ఆస్తిపై ఒక చిన్న, శాంతియుతమైన ఆచారాన్ని కూడా పాటించలేకపోతే, ఇక ఈ దేశంలో వారికి రాజ్యాంగబద్ధమైన న్యాయం ఎక్కడ లభిస్తుంది?
భారతదేశంలోని హిందువులందరూ ఒక కఠోర నిజాన్ని అర్థం చేసుకోవాలి. దీపం వెలిగించే హక్కు మనకే ఉందని చెన్నై హైకోర్టు మొదట సింగిల్ జడ్జి ద్వారా, ఆ తర్వాత ఉన్నత ధర్మాసనం ద్వారా ధృవీకరించింది. చట్టపరంగా మనం గెలిచాం. కానీ ఆచరణలో మాత్రం సర్దుకుపోవాల్సి వచ్చింది.
మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏ మతపరమైన పండుగనైనా ఒక వారం ఆలస్యంగా జరుపుకోగలరా? ఒక పవిత్రమైన రోజు వేడుకను వేరే సమయానికి మార్చగలరా? లేదు. ఎందుకంటే మతపరమైన సమయం, క్యాలెండర్ల పవిత్రత చర్చించలేనివి.
అయినా సనాతన ధర్మానికి సంబంధించిన ఆ పవిత్రమైన కార్తీక దీపపు క్షణం దొంగిలించబడింది. అది శాశ్వతంగా మాయమైపోయింది. ఎందుకంటే హిందువులను చులకనగా తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, ఎన్జీవోలు, మేధావులమని చెప్పుకునే బృందాలు.. ఇలా ఎవరైనా సరే, నష్టాన్ని అంగీకరించి సర్దుకుపోయేది మాత్రం ప్రతిసారీ హిందువులే. మనం హక్కును సాధించుకున్నాం, కానీ ఆచారాన్ని కోల్పోయాం. ఈ పునరావృత, వ్యవస్థాగత తిరస్కరణ కారణంగా, కేవలం కోర్టు విజయాలు మాత్రమే కాకుండా అంతకుమించి డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది. భక్తులే తమ దేవాలయాలు, మతపరమైన వ్యవహారాలను చురుకుగా నిర్వహించే 'సనాతన ధర్మ రక్షా బోర్డు' మనకు అవసరం.
హిందూ సంప్రదాయాలను, ఆచారాలను అపహాస్యం చేయడం కొన్ని సమూహాలకు పరిపాటిగా మారింది. ఇతర మతాల కార్యక్రమాల విషయంలో వారు అదే ధైర్యం చేయగలరా?
హిందువులకు ఆర్టికల్ 25 ప్రాథమిక హక్కు కాకుండా, ఐచ్ఛిక హక్కుగా మారిందా? ఒక పోలీస్ కమిషనర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ నిర్దిష్ట హైకోర్టు ఆదేశాలను ఏకపక్షంగా రద్దు చేయగలరా? చట్టబద్ధమైన భూమిలో దీపం వెలిగించడం 'హానిచేయని మతపరమైన చర్య' అని హైకోర్టు నిర్ధారించినప్పుడు, ఈ ఆచారం మత సామరస్యానికి ముప్పు అని ఎవరు, ఏ చట్టపరమైన యంత్రాంగం ద్వారా నిర్ణయిస్తారు? హిందూ మత సంస్థల శాఖ (HR&CE) అధికారులు నిలకడగా హిందూ భక్తుల ప్రయోజనాలకు, ఆలయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వారెలా జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటున్నారు?
మతపరమైన సమస్యలు తలెత్తినప్పుడు అబ్రహామిక్ మతాలను (అరేబియా మూలాలున్న మతాలు) అనుసరించేవారిలో ఉన్న ఐక్యతా స్ఫూర్తిని, సంఘీభావాన్ని హిందువులు గమనించాలి. వారు తమ విశ్వాసం కోసం జాతి, ప్రాంతీయ, భాషా భేదాలను అధిగమిస్తారు.
హిందువులు కులం, ప్రాంతం, భాషా అడ్డంకులతో విడిపోయి ఉన్నంత కాలం, హిందూ మతం, దాని ఆచారాలపై అపహాస్యాలు, అవమానాలు కొనసాగుతూనే ఉంటాయి. మన దేశంలోని హిందువులు హిందూ ధర్మం (తమిళంలో ఆరం) స్ఫూర్తితో ఒక ఉమ్మడి కనీస కార్యక్రమం కింద ఏకం కాకపోతే, ఈ స్ఫూర్తి నశించిపోతుంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారక వరకు ఉన్న ప్రతి హిందువు తమ సొంత గడ్డపై హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.