Advertisement

ఆ ప్రయాణం మరువలేనిది.. 'పుష్ప'పై అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్

Allu Arjun Emotional Post on Pushpa Unforgettable Journey
  • 'పుష్ప 2: ది రూల్' విడుదలై ఏడాది పూర్తి
  • సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌పెట్టిన అల్లు అర్జున్
  • 'పుష్ప' ఫ్రాంచైజీ తన జీవితంలో మరువలేని ప్రయాణం అన్న బన్నీ
  • ప్రేక్షకులకు, దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సంచలనం 'పుష్ప 2: ది రూల్'. గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.

"పుష్ప ఫ్రాంచైజీ మా జీవితంలో ఐదేళ్ల పాటు సాగిన మరువలేని ప్రయాణం. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ, మా కళను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవసరమైన ధైర్యాన్ని అందించింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము" అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ అద్భుత ప్రయాణంలో తనతో పాటు నడిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా చిత్ర దర్శకుడు సుకుమార్‌ను 'కెప్టెన్' అని సంబోధిస్తూ, ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని అన్నారు. "ఈ ప్రయాణంలో భాగమైన మీ ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి హృదయం నిండా కృతజ్ఞతతో... ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Allu Arjun
Pushpa
Sukumar
Tollywood
Twitter

More Telugu News