గీతను చదివిన వారు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- రక్తంతో లేఖలు రాసి తనను బెదిరించారన్న లక్ష్మీనారాయణ
- కష్టకాలంలో భగవద్గీత ధైర్యాన్నిచ్చిందని వ్యాఖ్య
- గాంధీ, నేతాజీ కూడా గీతను నమ్ముకున్నారని వెల్లడి
ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. "సీబీఐలో ఉన్నప్పుడు ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నాను. నన్ను భయపెట్టేందుకు కొందరు రక్తంతో లేఖలు రాశారు. 'నీ రక్తం చూస్తాం' అని హెచ్చరించారు. అయినా నేను భయపడలేదు. భగవద్గీతపై ఉన్న నమ్మకంతోనే నా కర్తవ్యాన్ని నిర్భయంగా నిర్వర్తించాను" అని తెలిపారు.
భగవద్గీత విద్యార్థుల్లో నైతిక విలువలు, ధైర్యం, నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అహింసను బోధించిన మహాత్మా గాంధీ, సాయుధ పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు కూడా గీతను ఆశ్రయించారని గుర్తు చేశారు. భగవద్గీత ప్రపంచానికే మార్గదర్శకమని, అది భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. "గీతను చదివిన వారు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు. ఇది నా ప్రత్యక్ష అనుభవం" అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.