ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

AP Minister Nara Lokesh Seeks Central Aid for Cyclone Damage
  • ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత
  • పార్లమెంటులో టీడీపీ ఎంపీలతో మంత్రుల భేటీ
  • కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్‌తో సమావేశాలు  
  • మోంథా తుపాను నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేత
  • తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్ర నిధులు కోరనున్న ఏపీ
ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో 'మోంథా' తుపాను సృష్టించిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, సహాయం కోరడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో సమావేశం కానున్నారు.

మంగళవారం పార్లమెంటుకు చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితలకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంటులోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తమ పార్టీ ఎంపీలతో మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఈ భేటీల అనంతరం మంత్రులు లోకేశ్, అనిత కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మోంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై రూపొందించిన సమగ్ర నివేదికను వారికి అందజేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరనున్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్ర మంత్రులతో కూలంకషంగా చర్చించనున్నారు.

Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Cyclone Montha
Amit Shah
Central Government
Financial Assistance
Relief Measures
Floods
Telugu Desam Party

More Telugu News