టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర
- కేసు విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు
- తొలుత 15 మందిని, తర్వాత మరో 9 మందిని..
- తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేర్చిన సిట్
ఈ కేసులో తొలుత 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 35 మందిపై కేసు నమోదు చేసి, పది మందిని అరెస్టు చేసింది. నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉండడం గమనార్హం. 2019-2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఈ కేసులో చేర్చింది. సిట్ నిందితుల జాబితాలో గతంలో టీటీడీలో జీఎంగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.