Dhruv Vikram: 'బైసన్' హీరో ధ్రువ్ విక్రమ్ పై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు
- 'బైసన్' చిత్రంలో ధ్రువ్ విక్రమ్ నటనపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు
- పాత్రలో సహజత్వం కోసం ధ్రువ్ ఎంతో కష్టపడ్డాడని కొనియాడిన డీకే
- దర్శకుడు మారి సెల్వరాజ్ సినిమాలు హార్డ్ హిట్టింగ్గా ఉంటాయన్న కార్తీక్
- ఇప్పటికే ఈ సినిమాను మెచ్చుకున్న రజినీకాంత్, ఉదయనిధి స్టాలిన్
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్, యువ నటుడు ధ్రువ్ విక్రమ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. దర్శకుడు మారి సెల్వరాజ్ రూపొందించిన 'బైసన్: కాలమాడన్' చిత్రంలో ధ్రువ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఈ పాత్రలో సహజంగా కనిపించడానికి ధ్రువ్ ఎంతో కష్టపడి ఉంటాడని డీకే అభిప్రాయపడ్డాడు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై దినేశ్ కార్తీక్ 'ఎక్స్' వేదికగా స్పందించాడు.
"బైసన్ సినిమా ఎంతో నచ్చింది. మారి సెల్వరాజ్ ఎంతో గొప్ప ఫిల్మ్ మేకర్! ఆయన సినిమాలు చాలా బలంగా, హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. ధ్రువ్ తన పాత్ర కోసం చాలా కష్టపడి ఉంటాడు. సహాయ నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. చిత్ర బృందానికి నా అభినందనలు" అని దినేశ్ కార్తీక్ తన పోస్టులో పేర్కొన్నాడు.
'బైసన్' చిత్రాన్ని మెచ్చుకున్న ప్రముఖుల జాబితాలో దినేశ్ కార్తీక్ తాజాగా చేరాడు. అంతకుముందే సూపర్స్టార్ రజినీకాంత్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి వారు ఈ సినిమాను, చిత్ర యూనిట్ను అభినందించారు. రజినీకాంత్ స్వయంగా మారి సెల్వరాజ్కు ఫోన్ చేసి, "ప్రతి సినిమాకు నీ కష్టం, ప్రతిభ నన్ను ఆకట్టుకుంటున్నాయి" అని మెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని ఒక శక్తిమంతమైన, హృద్యమైన స్పోర్ట్స్ డ్రామాగా అభివర్ణించారు.
నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో, ఓ కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, పా రంజిత్ నీలమ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించగా లాల్, పశుపతి, రాజీషా విజయన్ కీలక పాత్రలు పోషించారు.
"బైసన్ సినిమా ఎంతో నచ్చింది. మారి సెల్వరాజ్ ఎంతో గొప్ప ఫిల్మ్ మేకర్! ఆయన సినిమాలు చాలా బలంగా, హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. ధ్రువ్ తన పాత్ర కోసం చాలా కష్టపడి ఉంటాడు. సహాయ నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. చిత్ర బృందానికి నా అభినందనలు" అని దినేశ్ కార్తీక్ తన పోస్టులో పేర్కొన్నాడు.
'బైసన్' చిత్రాన్ని మెచ్చుకున్న ప్రముఖుల జాబితాలో దినేశ్ కార్తీక్ తాజాగా చేరాడు. అంతకుముందే సూపర్స్టార్ రజినీకాంత్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి వారు ఈ సినిమాను, చిత్ర యూనిట్ను అభినందించారు. రజినీకాంత్ స్వయంగా మారి సెల్వరాజ్కు ఫోన్ చేసి, "ప్రతి సినిమాకు నీ కష్టం, ప్రతిభ నన్ను ఆకట్టుకుంటున్నాయి" అని మెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని ఒక శక్తిమంతమైన, హృద్యమైన స్పోర్ట్స్ డ్రామాగా అభివర్ణించారు.
నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో, ఓ కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, పా రంజిత్ నీలమ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించగా లాల్, పశుపతి, రాజీషా విజయన్ కీలక పాత్రలు పోషించారు.