పవన్ కల్యాణ్తో లోకేశ్ కనగరాజ్ సినిమా?.. టాలీవుడ్లో హాట్ టాపిక్!
- భారీ బడ్జెట్తో నిర్మించనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్
- తమిళ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ను పక్కనపెట్టిన లోకేశ్
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ తదుపరి చిత్రం ఇదేనని ప్రచారం
‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో గ్యాంగ్స్టర్ డ్రామాలను కొత్తగా ఆవిష్కరించిన లోకేశ్, ప్రస్తుతం రజనీకాంత్తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్-కమల్హాసన్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం లోకేశ్ ఆ ప్రాజెక్ట్ను పక్కనపెట్టి, పవన్ కల్యాణ్తో సినిమా చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నటించేందుకు పవన్ కూడా సుముఖంగా ఉన్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్కు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం లోకేశ్ దర్శకత్వంలోనే ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. అయితే, ఈ వార్తలపై స్పష్టత రావాలంటే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.