కృష్ణా జలాలపై హక్కును వదులుకునే ప్రశ్నే లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
- కృష్ణా జలాలపై హక్కును వదులుకోబోమని చంద్రబాబు స్పష్టం
- జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదని వెల్లడి
- కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశం
- వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమని ప్రకటన
- జలవనరుల శాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
ఈ అంశంపై కేంద్రం వద్ద రాష్ట్ర వాదనలను బలంగా వినిపించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అయితే, వరదల సమయంలో వచ్చే నీటిని మాత్రం సామరస్యపూర్వక వాతావరణంలో పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.