Nara Lokesh: ఏపీ అసెంబ్లీలో అదరగొట్టిన విద్యార్థులు.. నిజమైన సభను తలపించిన 'మాక్ అసెంబ్లీ'
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో 'మాక్ శాసనసభ'
- 175 నియోజకవర్గాల నుంచి విద్యార్థులు పాల్గొని అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహణ
- స్పీకర్ ఎన్నిక, ప్రశ్నోత్తరాలు, బిల్లుల ఆమోదంతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన సభ
- రెండు కీలక బిల్లులపై వాడివేడి చర్చ.. ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులు
- పిల్లల కోసం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడమే అత్యంత ప్రధానం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పరిష్కారం చూపినప్పుడే అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ స్ఫూర్తిని చాటుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ విలువలు, చట్టసభల కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వినూత్న ఆలోచనకు ఇది రూపం దాల్చింది. నిజమైన అసెంబ్లీని తలపించేలా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వాగ్ధాటితో, విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఎం. లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య, ఉపముఖ్యమంత్రిగా కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా చిన్మయి, స్పీకర్గా స్వౌతి వ్యవహరించారు. సభాపతి ఎన్నిక నుంచి బిల్లుల ఆమోదం వరకు అన్ని ప్రక్రియలను విద్యార్థులే స్వయంగా నిర్వహించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు, సమస్యలపై చర్చలతో సభా కార్యక్రమాలు హోరాహోరీగా సాగాయి.
స్పీకర్ ఎన్నిక.. సభా గౌరవంపై హామీ
ముందుగా ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో సభ ప్రారంభమైంది. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న విద్యార్థి కే. లోకేశ్వర్ రెడ్డి.. కుమారి స్వాతి పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదించగా, మరో సభ్యుడు బి. అనిల్ కుమార్ బలపరిచారు. స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఆమెను గౌరవంగా స్పీకర్ కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్పీకర్ అధికార, ప్రతిపక్షాలకు సమానమని, సభా నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత స్పందిస్తూ.. "ప్రభుత్వం మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే, మీరే మాకు రక్షణగా నిలవాలి" అని కోరారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. "ఈ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు. కేవలం రాజ్యాంగం, సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను. సభా గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత" అని స్పష్టం చేశారు.
వాడివేడిగా ప్రశ్నోత్తరాలు.. మొబైల్ వ్యసనంపై చర్చ
స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ నిర్వహించారు. వ్యవసాయం, విద్య, హోం, క్రీడలు, పట్టణాభివృద్ధి వంటి పలు శాఖలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, విద్యార్థుల్లో మొబైల్ వ్యసనంపై ఈ ఏడాది ఎన్ని కేసులు నమోదయ్యాయనే ప్రశ్నకు, వందల్లో కేసులు నమోదయ్యాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, డీ-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు పరిశీలనలో ఉందని చెప్పారు.
అయితే, మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు లేవు. మీరు పైలట్ సెంటర్లు తెరిచేలోగా విద్యార్థుల భవిష్యత్తు స్విచ్ ఆఫ్ అయిపోతుంది" అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి స్పందిస్తూ, "మేం విద్యార్థులను బాధితులుగా చూస్తున్నాం, మీరు అల్లరి మీద దృష్టిపెట్టారు" అంటూ బదులిచ్చారు.
బిల్లులపై రగడ.. రంగంలోకి మార్షల్స్
అనంతరం సభలో 'ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత-సోషల్ మీడియా నియంత్రణ బిల్లు-2025', 'ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025' అనే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణ బిల్లుపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలనే నిబంధన పిల్లలపై భారం మోపడమేనని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.
స్పీకర్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారు వెనక్కి తగ్గకపోవడంతో మార్షల్స్ను పిలవాల్సి వచ్చింది. మార్షల్స్ రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న సభ్యులను సభ నుంచి బయటకు పంపించారు. అనంతరం మూజువాణి ఓటింగ్ ద్వారా రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
పుస్తకావిష్కరణ.. విద్యార్థులతో మమేకమైన నేతలు
మాక్ అసెంబ్లీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు హాజరయ్యారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత రాజ్యాంగం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మంత్రి నారా లోకేశ్ స్వయంగా విద్యార్థులకు శాసనసభ, శాసనమండలి హాళ్లను చూపించి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. వారితో కలిసి భోజనం చేసి, ఫోటోలు దిగి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియపై మరుపురాని అనుభూతిని అందించింది.









రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఎం. లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య, ఉపముఖ్యమంత్రిగా కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా చిన్మయి, స్పీకర్గా స్వౌతి వ్యవహరించారు. సభాపతి ఎన్నిక నుంచి బిల్లుల ఆమోదం వరకు అన్ని ప్రక్రియలను విద్యార్థులే స్వయంగా నిర్వహించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు, సమస్యలపై చర్చలతో సభా కార్యక్రమాలు హోరాహోరీగా సాగాయి.
స్పీకర్ ఎన్నిక.. సభా గౌరవంపై హామీ
ముందుగా ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో సభ ప్రారంభమైంది. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న విద్యార్థి కే. లోకేశ్వర్ రెడ్డి.. కుమారి స్వాతి పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదించగా, మరో సభ్యుడు బి. అనిల్ కుమార్ బలపరిచారు. స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఆమెను గౌరవంగా స్పీకర్ కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్పీకర్ అధికార, ప్రతిపక్షాలకు సమానమని, సభా నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత స్పందిస్తూ.. "ప్రభుత్వం మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే, మీరే మాకు రక్షణగా నిలవాలి" అని కోరారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. "ఈ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు. కేవలం రాజ్యాంగం, సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను. సభా గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత" అని స్పష్టం చేశారు.
వాడివేడిగా ప్రశ్నోత్తరాలు.. మొబైల్ వ్యసనంపై చర్చ
స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ నిర్వహించారు. వ్యవసాయం, విద్య, హోం, క్రీడలు, పట్టణాభివృద్ధి వంటి పలు శాఖలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, విద్యార్థుల్లో మొబైల్ వ్యసనంపై ఈ ఏడాది ఎన్ని కేసులు నమోదయ్యాయనే ప్రశ్నకు, వందల్లో కేసులు నమోదయ్యాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, డీ-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు పరిశీలనలో ఉందని చెప్పారు.
అయితే, మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు లేవు. మీరు పైలట్ సెంటర్లు తెరిచేలోగా విద్యార్థుల భవిష్యత్తు స్విచ్ ఆఫ్ అయిపోతుంది" అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి స్పందిస్తూ, "మేం విద్యార్థులను బాధితులుగా చూస్తున్నాం, మీరు అల్లరి మీద దృష్టిపెట్టారు" అంటూ బదులిచ్చారు.
బిల్లులపై రగడ.. రంగంలోకి మార్షల్స్
అనంతరం సభలో 'ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత-సోషల్ మీడియా నియంత్రణ బిల్లు-2025', 'ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025' అనే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణ బిల్లుపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలనే నిబంధన పిల్లలపై భారం మోపడమేనని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.
స్పీకర్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారు వెనక్కి తగ్గకపోవడంతో మార్షల్స్ను పిలవాల్సి వచ్చింది. మార్షల్స్ రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న సభ్యులను సభ నుంచి బయటకు పంపించారు. అనంతరం మూజువాణి ఓటింగ్ ద్వారా రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
పుస్తకావిష్కరణ.. విద్యార్థులతో మమేకమైన నేతలు
మాక్ అసెంబ్లీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు హాజరయ్యారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత రాజ్యాంగం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మంత్రి నారా లోకేశ్ స్వయంగా విద్యార్థులకు శాసనసభ, శాసనమండలి హాళ్లను చూపించి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. వారితో కలిసి భోజనం చేసి, ఫోటోలు దిగి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియపై మరుపురాని అనుభూతిని అందించింది.








