Narendra Modi: నేను చిన్నప్పుడే తమిళం నేర్చుకుని ఉండాల్సింది: కోయంబత్తూరులో ప్రధాని మోదీ
- కోయంబత్తూరు సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
- పీఎం కిసాన్ నిధులు విడుదల
- తమిళ భాషను ప్రశంసించిన ప్రధాని
తాను చిన్నతనంలోనే తమిళ భాష నేర్చుకుని ఉండాల్సింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం జరిగిన దక్షిణ భారత సేంద్రియ రైతుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఓ రైతు నాయకుడి తమిళ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని, కానీ అది పూర్తిగా అర్థం కాకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
సదస్సులో రైతు నాయకుడు పీఆర్ పాండియన్ తమిళంలో ప్రసంగించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, "పాండియన్ ప్రసంగం తమిళంలో ఉండటం వల్ల అద్భుతంగా ఉంది. కానీ, అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది చూశాక, చిన్నప్పుడే నేను తమిళం నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించింది" అని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలకు సభకు హాజరైన రైతుల నుంచి పెద్దయెత్తున చప్పట్లు లభించాయి. పాండియన్ ప్రసంగాన్ని తనకు హిందీ లేదా ఇంగ్లీషులోకి అనువదించి ఇవ్వాలని గవర్నర్ ఆర్.ఎన్. రవిని కోరినట్లు తెలిపారు.
ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' తాజా విడత నిధులను విడుదల చేశారు. "ఈ రోజు, దేశవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.18,000 కోట్లు జమ చేశాం. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్లకు పైగా నేరుగా రైతులకు అందించాం" అని వెల్లడించారు.
వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన కోయంబత్తూరు, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో నాయకత్వ స్థానంలో నిలవడం గర్వకారణమని ప్రధాని ప్రశంసించారు. అనంతరం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించి, రైతులతో ముచ్చటించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.10,000 కోట్ల ప్రయోజనం చేకూరిందని, పశుపోషకులు, మత్స్యకారులు కూడా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సాంకేతిక సమావేశాలు, ప్రదర్శనలు ఉంటాయి.
సదస్సులో రైతు నాయకుడు పీఆర్ పాండియన్ తమిళంలో ప్రసంగించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, "పాండియన్ ప్రసంగం తమిళంలో ఉండటం వల్ల అద్భుతంగా ఉంది. కానీ, అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది చూశాక, చిన్నప్పుడే నేను తమిళం నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించింది" అని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలకు సభకు హాజరైన రైతుల నుంచి పెద్దయెత్తున చప్పట్లు లభించాయి. పాండియన్ ప్రసంగాన్ని తనకు హిందీ లేదా ఇంగ్లీషులోకి అనువదించి ఇవ్వాలని గవర్నర్ ఆర్.ఎన్. రవిని కోరినట్లు తెలిపారు.
ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' తాజా విడత నిధులను విడుదల చేశారు. "ఈ రోజు, దేశవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.18,000 కోట్లు జమ చేశాం. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్లకు పైగా నేరుగా రైతులకు అందించాం" అని వెల్లడించారు.
వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన కోయంబత్తూరు, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో నాయకత్వ స్థానంలో నిలవడం గర్వకారణమని ప్రధాని ప్రశంసించారు. అనంతరం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించి, రైతులతో ముచ్చటించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.10,000 కోట్ల ప్రయోజనం చేకూరిందని, పశుపోషకులు, మత్స్యకారులు కూడా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సాంకేతిక సమావేశాలు, ప్రదర్శనలు ఉంటాయి.