Sathya Sai Baba: ప్రేమ, సేవకు ప్రతిరూపం సత్యసాయి... బాబాతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు
- పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు
- హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- ఈ భూమిపై మనం చూసిన దైవ స్వరూపం బాబా అని కొనియాడిన సీఎం
- రూ.100 స్మారక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి
- విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో బాబా సేవలను గుర్తు చేసుకున్న చంద్రబాబు
ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ప్రేమ, సేవ, శాంతి, పరిష్కారానికి బాబా నిలువెత్తు నిదర్శనమని ఆయన కొనియాడారు. పుట్టపర్తిలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని రూ.100 విలువైన స్మారక నాణేన్ని, ప్రధాని మోదీతో కలిసి సీఎం చంద్రబాబు స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఆయన శత జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టమని అన్నారు. "లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్" అనేది సత్యసాయి చూపిన మార్గమని, విశ్వశాంతి, సకల జనుల సంతోషం అనే ఉన్నత భావనతో ఆయన జీవించారని గుర్తుచేశారు. "మానవ సేవే మాధవ సేవ" అని కేవలం బోధించడమే కాకుండా, దాన్ని ఆచరించి ఫలితాలు చూపించిన మహనీయుడు బాబా అని పేర్కొన్నారు. ప్రేమ ఒక్కటే మతమని, హృదయం ఒక్కటే భాష అని, మానవత్వమే కులమని చాటిచెప్పారని, ఆయన బోధనలతో నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలను తన మనో దర్శనంతో ప్రభావితం చేశారని అన్నారు.
బాబాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, భక్తులను ఆయన ఎంతో ప్రేమగా ‘బంగారూ’ అని పిలిచే పిలుపు ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమాలపై బాబా పలుమార్లు తనతో చర్చించారని నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించిన ఘనత సత్యసాయిదని అన్నారు. నేడు 102 సత్యసాయి విద్యాలయాల ద్వారా సుమారు 60,000 మంది విద్యార్థులు ఉత్తమ విద్యను పొందుతున్నారని వివరించారు.
అదేవిధంగా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, జనరల్ ఆసుపత్రులు, మొబైల్ క్లినిక్ల ద్వారా ప్రతిరోజూ వేలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడానికి ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని బాబా సంకల్పించారని చంద్రబాబు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసిన భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారని, దీంతో రూ.550 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 1600 గ్రామాలకు, 30 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందిందని వివరించారు.
చెన్నై తాగునీటి పథకం ఆధునికీకరణకు రూ.250 కోట్లు వెచ్చించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సత్యసాయి ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి: పవన్ కల్యాణ్
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యసాయి బాబాను 'ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి'గా అభివర్ణించారు. అనంతపురం జిల్లాలో ఆయన జన్మించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. విదేశాల్లో సైతం సత్యసాయికి లక్షలాది మంది భక్తులు ఉండటం గర్వకారణమన్నారు. ప్రభుత్వాలు ఆలోచించకముందే జల్జీవన్ మిషన్ తరహాలో సామాన్యులకు తాగునీరు అందించిన మహనీయుడని కొనియాడారు. సచిన్ తెందూల్కర్ వంటి ప్రముఖులతో పాటు ఎందరో ఐఏఎస్ అధికారులు సైతం ఆయన ప్రభావానికి లోనయ్యారని గుర్తుచేశారు. సత్యసాయి బాబా స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఆయన శత జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టమని అన్నారు. "లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్" అనేది సత్యసాయి చూపిన మార్గమని, విశ్వశాంతి, సకల జనుల సంతోషం అనే ఉన్నత భావనతో ఆయన జీవించారని గుర్తుచేశారు. "మానవ సేవే మాధవ సేవ" అని కేవలం బోధించడమే కాకుండా, దాన్ని ఆచరించి ఫలితాలు చూపించిన మహనీయుడు బాబా అని పేర్కొన్నారు. ప్రేమ ఒక్కటే మతమని, హృదయం ఒక్కటే భాష అని, మానవత్వమే కులమని చాటిచెప్పారని, ఆయన బోధనలతో నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలను తన మనో దర్శనంతో ప్రభావితం చేశారని అన్నారు.
బాబాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, భక్తులను ఆయన ఎంతో ప్రేమగా ‘బంగారూ’ అని పిలిచే పిలుపు ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమాలపై బాబా పలుమార్లు తనతో చర్చించారని నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించిన ఘనత సత్యసాయిదని అన్నారు. నేడు 102 సత్యసాయి విద్యాలయాల ద్వారా సుమారు 60,000 మంది విద్యార్థులు ఉత్తమ విద్యను పొందుతున్నారని వివరించారు.
అదేవిధంగా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, జనరల్ ఆసుపత్రులు, మొబైల్ క్లినిక్ల ద్వారా ప్రతిరోజూ వేలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడానికి ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని బాబా సంకల్పించారని చంద్రబాబు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసిన భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారని, దీంతో రూ.550 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 1600 గ్రామాలకు, 30 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందిందని వివరించారు.
చెన్నై తాగునీటి పథకం ఆధునికీకరణకు రూ.250 కోట్లు వెచ్చించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సత్యసాయి ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి: పవన్ కల్యాణ్
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యసాయి బాబాను 'ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి'గా అభివర్ణించారు. అనంతపురం జిల్లాలో ఆయన జన్మించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. విదేశాల్లో సైతం సత్యసాయికి లక్షలాది మంది భక్తులు ఉండటం గర్వకారణమన్నారు. ప్రభుత్వాలు ఆలోచించకముందే జల్జీవన్ మిషన్ తరహాలో సామాన్యులకు తాగునీరు అందించిన మహనీయుడని కొనియాడారు. సచిన్ తెందూల్కర్ వంటి ప్రముఖులతో పాటు ఎందరో ఐఏఎస్ అధికారులు సైతం ఆయన ప్రభావానికి లోనయ్యారని గుర్తుచేశారు. సత్యసాయి బాబా స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.