Yash Mother Pushpa: బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన హీరో యశ్ తల్లి
- కేజీఎఫ్ స్టార్ యశ్ తల్లి పుష్పకు బెదిరింపులు
- పీఆర్వో హరీశ్ సహా ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు
- సినిమా పబ్లిసిటీ కోసం రూ. 64 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపణ
- డబ్బుల లెక్క అడిగితే సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని వెల్లడి
- బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఆధారాలు సమర్పించిన పుష్ప
కన్నడ సూపర్స్టార్ యశ్ తల్లి, సినీ నిర్మాత పుష్ప పోలీసులను ఆశ్రయించారు. తనను ఐదుగురు వ్యక్తులు మోసం చేయడమే కాకుండా, బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఆర్వో హరీశ్ ఉర్స్తో పాటు మరో నలుగురిపై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది.
పుష్ప నిర్మించిన 'కొత్తలవాడి' అనే సినిమా పబ్లిసిటీ కోసం నిందితులు తన వద్ద నుంచి రూ. 64 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత సినిమాకు ప్రచారం చేయకపోగా, ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేసి దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై పుష్ప మీడియాతో మాట్లాడుతూ, "సినిమా పబ్లిసిటీ కోసం మొదట రూ. 23 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, షూటింగ్ సమయంలో కూడా హరీశ్ మా నుంచి డబ్బులు తీసుకున్నాడు. సినిమా విడుదలకు సిద్ధమయ్యాక, డబ్బుల లెక్క అడిగితే సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మా డైరెక్టర్ను బెదిరించాడు" అని వివరించారు.
నిందితుల్లో ఉన్న స్వర్ణలత, గురు అనే వ్యక్తులు తమకు మీడియాతో సంబంధాలున్నాయని, తనపైనా, డైరెక్టర్పైనా తప్పుడు కథనాలు సృష్టిస్తామని బెదిరించారని పుష్ప తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించామని, కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా పొందామని చెప్పారు.
సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచి ఈ బ్లాక్మెయిల్ మొదలైందని, ఇప్పటికీ నిందితులు డబ్బుల లెక్క చెప్పలేదని పుష్ప వాపోయారు. హరీశ్ చేతిలో మోసపోయిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని, కానీ వారంతా భయంతో బయటకు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్ప నిర్మించిన 'కొత్తలవాడి' అనే సినిమా పబ్లిసిటీ కోసం నిందితులు తన వద్ద నుంచి రూ. 64 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత సినిమాకు ప్రచారం చేయకపోగా, ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేసి దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై పుష్ప మీడియాతో మాట్లాడుతూ, "సినిమా పబ్లిసిటీ కోసం మొదట రూ. 23 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, షూటింగ్ సమయంలో కూడా హరీశ్ మా నుంచి డబ్బులు తీసుకున్నాడు. సినిమా విడుదలకు సిద్ధమయ్యాక, డబ్బుల లెక్క అడిగితే సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మా డైరెక్టర్ను బెదిరించాడు" అని వివరించారు.
నిందితుల్లో ఉన్న స్వర్ణలత, గురు అనే వ్యక్తులు తమకు మీడియాతో సంబంధాలున్నాయని, తనపైనా, డైరెక్టర్పైనా తప్పుడు కథనాలు సృష్టిస్తామని బెదిరించారని పుష్ప తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించామని, కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా పొందామని చెప్పారు.
సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచి ఈ బ్లాక్మెయిల్ మొదలైందని, ఇప్పటికీ నిందితులు డబ్బుల లెక్క చెప్పలేదని పుష్ప వాపోయారు. హరీశ్ చేతిలో మోసపోయిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని, కానీ వారంతా భయంతో బయటకు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.