వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు తియ్యని కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
- సచివాలయ ఉద్యోగుల స్పౌజ్ బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
- అంతర్జిల్లా బదిలీలకు అనుమతిస్తూ అధికారికంగా జీవో జారీ
- ఆన్లైన్లో పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ
- నవంబర్ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
సచివాలయ ఉద్యోగుల నుంచి చాలాకాలంగా వస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేందుకు వీలు కల్పించే ఈ నిర్ణయంతో వేలాది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ బదిలీల ప్రక్రియను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పనితీరు మెరుగుపడటంతో పాటు, కుటుంబపరమైన ఒత్తిడిని తగ్గిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.