భర్తను, పిల్లలను కలవలేకపోతున్నా: 'వంటలక్క' ఆవేదన
- బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబాన్ని కలవలేకపోతున్నానంటూ వ్యాఖ్యలు
- గతంలోనూ తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవారని వెల్లడి
- ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ.. తెలుగులో అవకాశాలు పెరగడంతో బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందని ప్రేమి తెలిపారు. తాను కేరళలో ఉన్నప్పుడు కూడా తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవారని, ఇప్పుడు ఇద్దరం పనులతో బిజీగా ఉండటంతో ఒకరినొకరు కలుసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నప్పటికీ, కుటుంబానికి దూరంగా ఉండటం బాధ కలిగిస్తోందని ఆమె పరోక్షంగా వెల్లడించారు.
కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ 'కార్తీక దీపం' సీరియల్తో తెలుగు బుల్లితెరపై ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఈ సీరియల్లో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. మొదటి భాగం ముగిసిన తర్వాత, అభిమానుల కోరిక మేరకు 'కార్తీక దీపం: ఇది నవ వసంతం' పేరుతో కొత్త భాగాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.