మా అమ్మ ఇండియాలో సురక్షితంగా ఉన్నారు.. మరణశిక్ష విధించినా ఎవరూ ఏమీ చేయలేరు: షేక్‌ హసీనా కుమారుడు

Sheikh Hasina Safe in India Son Claims
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఈరోజు తీర్పు వెలువరించనుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో రాజధాని ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిణామాలపై హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ స్పందిస్తూ తన తల్లికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివసిస్తున్న సాజిబ్ వాజెద్ మాట్లాడుతూ.. "మా అమ్మపై తీర్పు ఎలా ఉంటుందో మాకు తెలుసు. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారు. బహుశా మరణశిక్ష కూడా విధించవచ్చు. కానీ వారు నా తల్లిని ఏమీ చేయలేరు. ఆమె ప్రస్తుతం భారత్‌లో సురక్షితంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. తమ అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయకపోతే బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఆందోళనలు తప్పవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు, భారత్ నుంచే వర్చువల్‌గా తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన షేక్ హసీనా.. తనపై నమోదైన కేసులన్నీ చట్టవిరుద్ధమని, కుట్రపూరితమైనవని ఆరోపించారు. "ఇలాంటి చర్యలతో నా గళాన్ని అణచివేయలేరు. నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించాలి" అని ఆమె తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గతేడాది విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పదవి కోల్పోయిన షేక్ హసీనా.. ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. గతేడాది జరిగిన అల్లర్లలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో ఆమెపై హత్య సహా పలు తీవ్రమైన కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Sheikh Hasina
Bangladesh
Awami League
Sajeeb Wazed
India
Dhaka
International Crimes Tribunal
Bangladesh Elections
Political unrest
Human rights violations

More Telugu News