India A: పాక్ చేతిలో భారత్ 'ఏ' ఘోర పరాజయం.. కుప్పకూలిన బ్యాటింగ్.. అంపైరింగ్ వివాదం!

India A Suffers Defeat Against Pakistan Shaheens in Asia Cup
  • ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్‌పై పాక్ ఘన విజయం
  • కుప్పకూలిన టీమిండియా 'ఏ' బ్యాటింగ్ ఆర్డర్
  • 91/2 నుంచి 136 పరుగులకు ఆలౌట్
  • సదాకత్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ ఈజీ చేజింగ్‌
  • మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయాలపై వివాదం
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత 'ఏ' జట్టుకు పాకిస్థాన్ షాహీన్స్ చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమవడంతో పాకిస్థాన్ సునాయాస విజయాన్ని అందుకుంది. మాజ్ సదాకత్ (47 బంతుల్లో 79 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పాక్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, మంచి శుభారంభం లభించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. వైభవ్ సూర్యవంశీ (45), నమన్ ధీర్ రాణించడంతో ఒక దశలో 91/2 స్కోరుతో పటిష్ఠంగా కనిపించింది. అయితే, సూర్యవంశీ ఔటైన తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. భారత జట్టు కేవలం 45 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను కోల్పోయి కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు.

అంపైరింగ్ వివాదం
అయితే, ఈ మ్యాచ్‌లో కొన్ని అంపైరింగ్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా అశుతోశ్‌ శర్మ వికెట్ విషయంలో అంపైర్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. కీలక సమయంలో కొన్ని నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా రావడం భారత జట్టును దెబ్బతీసింది.

యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో (42 బంతుల్లో 144) చెలరేగిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో 45 పరుగులకే పరిమితమయ్యాడు. అతను క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఔటవ్వడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఏ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ జరిగినా తీవ్రమైన పోటీ, ఉత్కంఠ నెలకొనడం సాధారణం. ఈ మ్యాచ్ కూడా అందుకు మినహాయింపు కాలేదు.
India A
Pakistan Shaheens
Asia Cup Rising Stars
Vaibhav Suryavanshi
cricket
Maz Sadaqat
Umpiring controversy
Naman Dhir
India vs Pakistan

More Telugu News