చంద్రబాబు, లోకేశ్ లకు కంగ్రాట్స్ చెప్పిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఏపీ ప్రభుత్వానికి సీబీఐ మాజీ జేడీ కీలక సూచనలు
- విశాఖ సదస్సుపై ప్రశంసలు, ఒప్పందాల అమలుపై సలహాలు
- ఒప్పందాలు కార్యరూపం దాల్చాలంటే ఇవే ముఖ్యం
- ప్రభుత్వానికి మూడు కీలక సూత్రాలు చెప్పిన లక్ష్మీనారాయణ
ఒప్పందాలు (MoUs) నిజమైన ఉద్యోగాలు, అభివృద్ధిగా మారాలంటే ప్రభుత్వం మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఆయన సూచించిన కీలక అంశాలు:
* నిజంగా సమర్థవంతంగా పనిచేసే సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
* భూ వివాదాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించాలి.
* పర్యావరణ అనుమతులను సకాలంలో, వేగంగా మంజూరు చేయాలి.
ఈ మూడు అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు సాగితేనే కుదుర్చుకున్న ఒప్పందాలు పరిశ్రమలుగా మారి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని వీవీ లక్ష్మీనారాయణ తన పోస్టులో పేర్కొన్నారు.