Nara Lokesh: సారీ అండీ... ఇవాళ సండే: మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
- కొత్త పెట్టుబడుల ప్రకటనపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
- ఆదివారం సెలవని, ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ చూస్తున్నానని వెల్లడి
- విశాఖ సీఐఐ సదస్సు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ స్పందన
- సదస్సులో మూడు రోజుల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- మొత్తం 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించిందని విశ్లేషణలు
భారీ పెట్టుబడుల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారా?... బ్రేకింగ్ న్యూస్.. క్షమించండి, ఈరోజు ఆదివారం మాకు సెలవు!" అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. మేం ఆ మ్యాచ్ చూడటంలో బిజీగా ఉన్నాం" అని ఆయన తన ట్వీట్లో సరదాగా పేర్కొన్నారు.
విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని అందరూ ఆశిస్తున్న తరుణంలో లోకేశ్ ఈ విధంగా స్పందించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడుల వరద పారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృషితో ఈ సదస్సు విజయవంతమైంది.
ఈ సదస్సులో మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో సుమారు 16 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని అందరూ ఆశిస్తున్న తరుణంలో లోకేశ్ ఈ విధంగా స్పందించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడుల వరద పారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృషితో ఈ సదస్సు విజయవంతమైంది.
ఈ సదస్సులో మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో సుమారు 16 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.