ఢిల్లీ కారు పేలుడు.. ఇంటి బాట పట్టిన అల్ ఫలా విశ్వవిద్యాలయం విద్యార్థులు
- పిల్లల చదువులపై తల్లిదండ్రుల ఆందోళన
- విశ్వవిద్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందాలు
- అనుమానిత విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్న సిబ్బంది
ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతున్నారు. అల్ ఫలా విశ్వవిద్యాలయంలో విచారణ వేగంగా కొనసాగుతోంది. దర్యాప్తు బృందాలు సిబ్బందిని ప్రశ్నిస్తూ, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత విద్యార్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతుండటంతో తరగతుల కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది.