సీఐఐ సదస్సు వేదికగా ఏపీకి పెట్టుబడుల పంట.. రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Chandrababu Launches Raymond Projects in Andhra Pradesh
  • సీఐఐ సదస్సు రెండో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ
  • రూ.1201 కోట్ల రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన
  • అనంతపురం జిల్లాలో మూడు యూనిట్లు ఏర్పాటు చేయనున్న రేమాండ్
  • ఈ ప్రాజెక్టులతో 6,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు
  • ఎల్జీ కెమ్, ఇఫ్కో, జపాన్, న్యూజిలాండ్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు.. ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమాండ్ గ్రూప్‌కు చెందిన మూడు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1201 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో పాటు రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నా పాల్గొన్నారు. రేమాండ్ గ్రూప్.. రాప్తాడులో రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ పార్క్, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ ప్లాంట్, టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.

ఈ సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల అధిపతులతో పాటు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. సీఎం సమక్షంలో శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులతో పాటు మరిన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదరనున్నాయి.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh investments
CII Partnership Summit
Raymond Group
Anantapur district
TG Bharat
Gautam Maini
Silver Spark Apparel Park
Auto Component Plant
Aerospace equipment

More Telugu News