Revanth Reddy: కేసీఆర్ గురించి అందుకే మాట్లాడను: జూబ్లీహిల్స్ ఫలితంపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy Comments on Jubilee Hills Result and KCR
  • ఈ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనందువల్ల ఆయన గురించి మాట్లాడబోనన్న రేవంత్ 
  • కేటీఆర్‌కు అహంకారం పోలేదని, హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని సూచన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందని అన్నారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

కేసీఆర్ క్రియాశీలకంగా లేరు

రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకంగా లేనందున తాను ఆయన గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని అన్నారు. అయితే కేటీఆర్‌కు అహంకారం పోలేదని, హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు.

వారి తీరు మారకుంటే ప్రజలు ఎలా అంగీకరిస్తారన్న విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రుల అభిప్రాయాలను తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Revanth Reddy
Jubilee Hills
Telangana
KCR
KTR
Harish Rao
Congress Party
Naveen Yadav

More Telugu News