Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు జనసేన పార్టీ కౌంటర్
- పెద్దిరెడ్డి అటవీ భూములు కబ్జా చేశారన్న పవన్ కల్యాణ్
- పవన్ వ్యాఖ్యలకు బదులిచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- తాజాగా మిథున్ రెడ్డిపై జనసేన ఫైర్
- 76 ఎకరాల భూమి 104 ఎకరాలుగా ఎలా మారింది? అంటూ ప్రశ్న
- 32 ఎకరాల అడవిని కబ్జా చేశారని ఆరోపణ
- త్వరలోనే కబ్జా చిట్టా, పండ్ల తోటల వివరాలు బయటపెడతామని హెచ్చరిక
మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పవన్ విడుదల చేసిన వీడియోపై పెద్దిరెడ్డి తనయుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించగా, తాజాగా ఆయన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
"సోషల్ మీడియాలో బుకాయించినంత మాత్రాన మీ తండ్రి చేసిన అటవీ ఆక్రమణలు చట్టబద్ధం అయిపోవు" అంటూ జనసేన పార్టీ మిథున్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 1968 నాటి మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76 ఎకరాలుగా ఉన్న భూమి, 103 ఎకరాల 98 సెంట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. మొత్తం 32 ఎకరాల 63 సెంట్ల అటవీ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ, ఈ విషయాన్ని తండ్రి రామచంద్రారెడ్డిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికింది.
చట్టం నుంచి తప్పించుకోవడం కబ్జా చేసినంత సులభం కాదని జనసేన హెచ్చరించింది. తమ నాయకుడు పవన్ కల్యాణ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని, పెద్దిరెడ్డి కుటుంబం ఏం చేస్తుందో ప్రజలందరికీ తెలుసని పేర్కొంది. "అలాంటి మీరు కూడా మా నాయకుడిని విమర్శించడమా?" అంటూ జనసేన పార్టీ మండిపడింది.
అంతటితో ఆగకుండా, మరికొద్ది సేపట్లోనే పెద్దిరెడ్డికి సంబంధించిన కబ్జా చిట్టాతో పాటు, అందులోని పండ్ల తోటల వివరాలను కూడా బయటపెడతామని జనసేన పార్టీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
"సోషల్ మీడియాలో బుకాయించినంత మాత్రాన మీ తండ్రి చేసిన అటవీ ఆక్రమణలు చట్టబద్ధం అయిపోవు" అంటూ జనసేన పార్టీ మిథున్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 1968 నాటి మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76 ఎకరాలుగా ఉన్న భూమి, 103 ఎకరాల 98 సెంట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. మొత్తం 32 ఎకరాల 63 సెంట్ల అటవీ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ, ఈ విషయాన్ని తండ్రి రామచంద్రారెడ్డిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికింది.
చట్టం నుంచి తప్పించుకోవడం కబ్జా చేసినంత సులభం కాదని జనసేన హెచ్చరించింది. తమ నాయకుడు పవన్ కల్యాణ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని, పెద్దిరెడ్డి కుటుంబం ఏం చేస్తుందో ప్రజలందరికీ తెలుసని పేర్కొంది. "అలాంటి మీరు కూడా మా నాయకుడిని విమర్శించడమా?" అంటూ జనసేన పార్టీ మండిపడింది.
అంతటితో ఆగకుండా, మరికొద్ది సేపట్లోనే పెద్దిరెడ్డికి సంబంధించిన కబ్జా చిట్టాతో పాటు, అందులోని పండ్ల తోటల వివరాలను కూడా బయటపెడతామని జనసేన పార్టీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.