రెడ్ లైట్ వద్దకు ఓ కారు నిదానంగా వచ్చి ఆగింది... ఆ కారులోనే పేలుడు జరిగింది: ఢిల్లీ పోలీస్ కమిషనర్

  • దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు
  • ఎర్రకోట వద్ద ఘటనలో 8 మంది దుర్మరణం
  • మరో 24 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
  • ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే పేలిన కారు
  • పహల్గామ్ దాడి మరువక ముందే మరో విషాదం
  • రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఓ కారు బాంబు పేలుడులో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ (సీపీ) మీడియాకు వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6:52 గంటల సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. రెడ్ లైట్ పడటంతో ఓ కారు నెమ్మదిగా వచ్చి ఆగిందని, అది ఆగుతున్న సమయంలోనే భారీ శబ్దంతో పేలిపోయిందని వివరించారు.

పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయని సీపీ తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసం కాగా, కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని సీపీ వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు.  

Delhi Police Commissioner
Delhi blast
Red Fort
Car bomb explosion
Delhi car bomb
Bomb blast India
National Investigation Agency
NIA investigation
Delhi police
Terrorist attack

More Telugu News