Bihar Elections: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. 77 ఏళ్లుగా మూడు గ్రామాల నిరసన
- బీహార్లో ఒక వంతెన కోసం మూడు గ్రామాల ఎన్నికల బహిష్కరణ
- 77 ఏళ్లుగా మోర్హర్ నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్
- బ్రిడ్జి లేకపోతే ఓటు వేయబోమని స్పష్టం చేసిన గ్రామస్థులు
- వర్షాకాలంలో నాలుగు నెలలు బాహ్య ప్రపంచంతో తెగిపోతున్న సంబంధాలు
- వైద్యం అందక ఏటా ప్రాణాలు కోల్పోతున్నామని గ్రామస్థుల ఆవేదన
బీహార్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి, మహిళా సంక్షేమం, యువత ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. కానీ, గయకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని కొన్ని గ్రామాలకు మాత్రం అభివృద్ధి అనేది 77 ఏళ్లుగా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తమ దశాబ్దాల డిమాండ్ను నెరవేర్చని పాలకులపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మోర్హర్ నదిపై వంతెన నిర్మించే వరకు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు.
పత్రా, హెర్హంజ్, కేవల్డిహ్ అనే మూడు గ్రామాలకు చెందిన సుమారు 8,000 మంది ప్రజలు తరతరాలుగా ఒకే ఒక్క కోరిక కోసం ఎదురుచూస్తున్నారు. తమ గ్రామాలను బాహ్య ప్రపంచంతో కలిపే మోర్హర్ నదిపై ఒక వంతెన నిర్మించాలన్నదే వారి డిమాండ్. ఆ నదిని వారు "నిస్సహాయ నది"గా పిలుచుకుంటున్నారు. "బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం. ‘పుల్ నహీ తో వోట్ నహీ’ (వంతెన లేకుంటే ఓటు లేదు)" అని ఓ మహిళా ఓటరు స్పష్టం చేశారు. "77 ఏళ్లుగా అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ హామీలు మాత్రం నెరవేర్చరు. వర్షాకాలంలో నదిలో నీటి మట్టం భుజాల వరకు వస్తుంది. మాకు అభివృద్ధి అంటే ఈ వంతెన నిర్మాణమే" అని ఆమె తెలిపారు.
ప్రతి ఏటా వర్షాకాలంలో దాదాపు నాలుగు నెలల పాటు ఈ గ్రామాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. నిత్యావసరాల కోసం మార్కెట్కు వెళ్లాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా, రైతులు తమ పంటను అమ్ముకోవాలన్నా ప్రాణాల మీద ఆశ వదులుకుని నదిని దాటాల్సిందే. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లడం వీలుకాక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల పత్రా గ్రామానికి చెందిన సునీల్ విశ్వకర్మ అనే వ్యక్తికి అనారోగ్యం పాలవగా, నది దాటలేక సరైన సమయంలో వైద్యం అందక నది ఒడ్డునే ప్రాణాలు విడిచాడు. "నది వల్లే వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయాం. అంబులెన్స్ రాలేదు. ప్రైవేట్ వాహనం మాట్లాడితే అది నదికి అవతలి వైపు ఉండిపోయింది" అని విశ్వకర్మ తల్లి కన్నీరు పెట్టుకున్నారు. గర్భిణులు 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లేలోపే మార్గమధ్యంలో మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. "వర్షాకాలంలో ఏటా ఇక్కడ కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు. మా బతుకులు ఇంత దుర్భరంగా ఉన్నాయి" అని మరో గ్రామస్థుడు వాపోయారు.
పత్రా, హెర్హంజ్, కేవల్డిహ్ అనే మూడు గ్రామాలకు చెందిన సుమారు 8,000 మంది ప్రజలు తరతరాలుగా ఒకే ఒక్క కోరిక కోసం ఎదురుచూస్తున్నారు. తమ గ్రామాలను బాహ్య ప్రపంచంతో కలిపే మోర్హర్ నదిపై ఒక వంతెన నిర్మించాలన్నదే వారి డిమాండ్. ఆ నదిని వారు "నిస్సహాయ నది"గా పిలుచుకుంటున్నారు. "బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం. ‘పుల్ నహీ తో వోట్ నహీ’ (వంతెన లేకుంటే ఓటు లేదు)" అని ఓ మహిళా ఓటరు స్పష్టం చేశారు. "77 ఏళ్లుగా అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ హామీలు మాత్రం నెరవేర్చరు. వర్షాకాలంలో నదిలో నీటి మట్టం భుజాల వరకు వస్తుంది. మాకు అభివృద్ధి అంటే ఈ వంతెన నిర్మాణమే" అని ఆమె తెలిపారు.
ప్రతి ఏటా వర్షాకాలంలో దాదాపు నాలుగు నెలల పాటు ఈ గ్రామాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. నిత్యావసరాల కోసం మార్కెట్కు వెళ్లాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా, రైతులు తమ పంటను అమ్ముకోవాలన్నా ప్రాణాల మీద ఆశ వదులుకుని నదిని దాటాల్సిందే. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లడం వీలుకాక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల పత్రా గ్రామానికి చెందిన సునీల్ విశ్వకర్మ అనే వ్యక్తికి అనారోగ్యం పాలవగా, నది దాటలేక సరైన సమయంలో వైద్యం అందక నది ఒడ్డునే ప్రాణాలు విడిచాడు. "నది వల్లే వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయాం. అంబులెన్స్ రాలేదు. ప్రైవేట్ వాహనం మాట్లాడితే అది నదికి అవతలి వైపు ఉండిపోయింది" అని విశ్వకర్మ తల్లి కన్నీరు పెట్టుకున్నారు. గర్భిణులు 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లేలోపే మార్గమధ్యంలో మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. "వర్షాకాలంలో ఏటా ఇక్కడ కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు. మా బతుకులు ఇంత దుర్భరంగా ఉన్నాయి" అని మరో గ్రామస్థుడు వాపోయారు.