చేవెళ్ల బస్సు ప్రమాదం.. సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
- డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశం
- రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు
- నివేదిక పంపాలని కలెక్టర్, ఆర్టీసీ ఎండీలకు కూడా ఆదేశం
ఈ మేరకు రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను సైతం నివేదిక పంపాలని ఆదేశించింది. ప్రమాద సమయంలో ట్రక్కులోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక వారు మృతి చెందారు.