డ్రగ్స్ దందాలో డాక్టర్.. ఇంట్లోనే దుకాణం పెట్టిన హైదరాబాద్ వైద్యుడు
- సోదాల్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
- ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్న ముఠా
- డాక్టర్ నివాసం అడ్డాగా మార్చుకుని అమ్మకాలు
సోదాల్లో రూ.3 లక్షల విలువ చేసే ఓజీకుష్, ఎండీఎంఏ, కొకైన్, హాష్ఆయిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాన్పాల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రమోద్, సందీప్, శరత్ ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని బయటపడిందని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి గుట్టుగా అమ్ముతున్నారని, ఇందుకు జాన్ పాల్ సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. డ్రగ్స్ ను అమ్మినందుకు జాన్ పాల్ కు కొంత ఉచితంగా ఇస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.