Jayasudha: చేవెళ్ల బస్సు ప్రమాదంలో టీచర్ నరకయాతన

Chevella Bus Accident Teacher Jayasudha injured
  • టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోకి..!
  • నడుములోతు కంకరలో ఇరుక్కున్న టీచర్
  • జేసీబీతో వెలికి తీసి ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ టీమ్
చేవెళ్లలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం స్థానికులను కంటతడి పెట్టించింది. 
 
తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్‌ కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొందరు నడుములోతు కంకరలో ఇరుక్కుని బయటకు రాలేకపోయారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు నిమ్స్‌కు తరలించారు.

కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులూ అదే బస్సులో రావాల్సింది. ఆలస్యంగా రావడంతో వారు ఈ బస్సును అందుకోలేకపోయారు. వేరే బస్సులో బయలుదేరడంతో వారంతా ప్రమాదం తప్పించుకున్నారు.
Jayasudha
Chevella bus accident
Telangana bus accident
Vikrabad bus accident
Teacher rescued
NIMS hospital
Karelli village
Social Welfare Gurukula School
Road accident India

More Telugu News