KCR: ఘోర బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ స్పందన

KCR KTR React to Rangareddy Bus Accident Tragedy
  • ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని 19 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్, కేటీఆర్
  • బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ... ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన తీరు కలచివేసిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, అనేక మంది గాయపడటం పట్ల సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
KCR
K Taraka Rama Rao
BRS Party
Telangana
Road Accident
Chevella
RTC Bus Accident
Khanapur
Telangana Government

More Telugu News