Allu Sirish: నా పెళ్లికి కారణం వాళ్లే.. లవ్ స్టోరీ చెప్పిన శిరీష్
- త్వరలో పెళ్లిపీటలెక్కనున్న నటుడు అల్లు శిరీష్
- నయనికతో అక్టోబర్ 31న జరిగిన నిశ్చితార్థం
- నటుడు నితిన్ భార్య స్నేహితురాలే కాబోయే వధువు
- వరుణ్ తేజ్ పెళ్లి పార్టీలో తొలిసారి పరిచయం
- తన ప్రేమకథ ఎలా మొదలైందో వివరించిన శిరీష్
మెగా కాంపౌండ్ హీరో, అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే నయనికతో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే, తమ ప్రేమకథ ఎలా మొదలైందో, కాబోయే భార్య తొలిసారి ఎక్కడ పరిచయమైందో శిరీష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ శిరీష్ తన ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. "గతేడాది అక్టోబర్లో వరుణ్-లావణ్యల పెళ్లి సమయంలో నటుడు నితిన్, ఆయన భార్య షాలిని ఓ పార్టీ ఇచ్చారు. ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చింది. నేను నయనికను తొలిసారి చూసింది అక్కడే" అని శిరీష్ తెలిపారు.
ఆ పార్టీలోనే మొదలైన తమ పరిచయం ప్రేమగా మారిందని, ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చిందని ఆయన వివరించారు. "భవిష్యత్తులో మా పిల్లలు మన పరిచయం ఎలా జరిగిందని అడిగితే ఇదే కథ చెబుతాను. నన్ను తమ స్నేహితుల సర్కిల్లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ ధన్యవాదాలు" అని శిరీష్ తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, అక్టోబర్ 31న అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయి దుర్గాతేజ్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ శిరీష్ తన ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. "గతేడాది అక్టోబర్లో వరుణ్-లావణ్యల పెళ్లి సమయంలో నటుడు నితిన్, ఆయన భార్య షాలిని ఓ పార్టీ ఇచ్చారు. ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చింది. నేను నయనికను తొలిసారి చూసింది అక్కడే" అని శిరీష్ తెలిపారు.
ఆ పార్టీలోనే మొదలైన తమ పరిచయం ప్రేమగా మారిందని, ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చిందని ఆయన వివరించారు. "భవిష్యత్తులో మా పిల్లలు మన పరిచయం ఎలా జరిగిందని అడిగితే ఇదే కథ చెబుతాను. నన్ను తమ స్నేహితుల సర్కిల్లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ ధన్యవాదాలు" అని శిరీష్ తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, అక్టోబర్ 31న అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయి దుర్గాతేజ్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.