Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి సిట్.. నకిలీ మద్యం కేసులో అరెస్ట్‌‌కు రంగం సిద్ధం!

Jogi Ramesh SIT reaches ex ministers house in fake liquor case
  • నకిలీ మద్యం కేసులో రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు
  • రమేశ్ ప్రోద్బలంతోనే నేరం జరిగిందన్న ఏ1 నిందితుడి వాంగ్మూలం
  • ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో రమేశ్ నివాసం వద్ద పోలీసుల మోహరింపు
  • నిందితుడి వాంగ్మూలంతో రమేశ్‌కు బిగుస్తున్న ఉచ్చు
నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం.. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రామును అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు ఇటీవల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రోద్బలంతో నకిలీ మద్యం తయారు చేసినట్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి చేరుకుంది. ఆయనను విచారించి, అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

పోలీసుల రాకతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసులో జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడి పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రధాన నిందితుడి వాంగ్మూలంతో ఈ కేసులో మాజీ మంత్రికి ఉచ్చు బిగుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కేసుతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని, రాజకీయ కక్షతో కేసులో ఇరికిస్తున్నారంటూ జోగి రమేశ్ పేర్కొంటూ వస్తున్నారు. 
Jogi Ramesh
Fake liquor case
Andhra Pradesh
YSRCP
SIT investigation
Ibrahimpatnam
Ram Murthy
Adepalli Janardhana Rao
Political conspiracy

More Telugu News