శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆందోళనలో భక్తులు
- 150వ మెట్టు వద్ద కనిపించిన చిరుత
- భయాందోళనతో కేకలు వేసిన భక్తులు
- భక్తులను గుంపులుగుంపులుగా పంపిస్తున్న టీటీడీ సిబ్బంది
భద్రతా చర్యల్లో భాగంగా శ్రీవారి మెట్టు ప్రారంభంలో, 800వ మెట్టు వద్ద భక్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో 100-150 మంది భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. పిల్లలను జాగ్రత్తగా పట్టుకొని నడవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ సిబ్బంది భక్తులకు సూచించారు.