టికెట్ బుక్ చేసి క్యాన్సల్ చేస్తూ రూ.3 కోట్లు కాజేశారు.. ట్రావెల్ కంపెనీని ముంచిన కేటుగాళ్లు
- సాఫ్ట్ వేర్ బగ్ ను అవకాశంగా మలుచుకుని ఘరానా మోసం
- బుక్ చేసిన సెకన్ల వ్యవధిలో క్యాన్సల్..
- ఖాతాలో డబ్బు కట్ కాకున్నా ట్రావెల్ కంపెనీ నుంచి రిఫండ్
- ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
మోసం జరిగిందిలా..
ఓ ప్రముఖ ట్రావెల్ కంపెనీ సైట్ లో సైబర్ నేరస్తులు లాగిన్ అయి డిజిటల్ వాలెట్ లో డబ్బు జమ చేశారు. ఆపై టికెట్ బుక్ చేసి క్షణాల వ్యవధిలోనే రద్దు చేసేవారు. దీంతో టికెట్ బుకింగ్ కు సంబంధించి కస్టమర్ ఖాతాలో నుంచి డబ్బు కట్ అయ్యేది కాదు. అయితే, టికెట్ రద్దు చేసిన మెసేజ్ తో పాటు ఆ టికెట్ సొమ్ము కూడా కస్టమర్ ఖాతాలో జమయ్యేది. ఈ ఏడాది మే నుంచి జులై వరకు.. 3 నెలల్లో ట్రావెల్ కంపెనీ డిజిటల్ వాలెట్ నుంచి ఏకంగా 3 కోట్లకు పైగా నగదు కాజేశారు. ఈ మోసంలో సదరు ట్రావెల్ సంస్థ ఏజెంట్ల హస్తం కూడా ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.