రియల్ టైమ్ మానిటరింగ్, రియల్ టైమ్ సొల్యూషన్: మొంథా తుఫాన్ పర్యవేక్షణలో హైఎండ్ టెక్నాలజీ వినియోగం
- వివిధ మార్గాల నుంచి వచ్చిన డేటాతో సమగ్ర విశ్లేషణ
- ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించిన టెక్నాలజీ
- 602 డ్రోన్లు, 14,770 సీసీటీవీలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ
- 1.1 కోట్ల మెసేజీలతో ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్ కేంద్రం
- ముఖ్యమంత్రి దిశా నిర్దేశంతో టెక్నోక్రాట్లుగా మారి తుఫాన్ సహయక చర్యలను పర్యవేక్షించిన ఐఏఎస్లు
- సాంకేతికతతో మొంథా తుఫాన్ పర్యవేక్షణ చేసిన విధానాన్ని వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్
ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. తుఫాను హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి తుఫాను కదలికలను గమనించడం, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడటం వంటి అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. అయితే, మొంథా తుఫాను విషయంలో ఆయన కొంత విభిన్నంగా వ్యవహరించారు.
రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తూనే సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రియల్ టైమ్ డేటాను అప్డేట్ చేసుకుంటూ, వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ, రియల్ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా పని చేశారు. డేటా ఆధారిత విపత్తు నిర్వహణ నమూనాను ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, టెక్నాలజీని అనుసంధానించి రియల్ టైమ్లో సమన్వయం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, అవి అమలు అయ్యేలా చూడటంలో ఈ నమూనా విజయం సాధించింది. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంతోపాటు వివిధ శాఖల నుంచి ఆర్టీజీఎస్ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని అనుసంధానించి AWARE 2.0 వ్యవస్థ ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం.
సాంకేతికత ద్వారా మొంథా తుఫాను సహాయక చర్యలను ఏ విధంగా పర్యవేక్షించారనే వివరాలను ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి తొమ్మిదిసార్లు టెలీ కాన్ఫరెన్సులు, ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ విభాగాలు, క్షేత్ర స్థాయి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన సమాచారంతో, అవసరమైన ప్రాంతాలకు సహయక చర్యలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసేలా ప్రభుత్వం సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించింది. అవసరమైన చోట యంత్ర పరికరాలను, మానవ వనరులను సమర్థంగా కేటాయించడంలోనూ సాంకేతికత సహాయపడింది.
టెక్నాలజీ వనరుగా – AWARE 2.0
AWARE 2.0 వ్యవస్థకు స్టేట్ డేటాలేక్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా రియల్ టైములో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. వర్షపాతం, గాలి, పిడుగుల వంటి వాటిపై హెచ్చరికలు జారీ చేసేలా అవేర్-2.0 వ్యవస్థ పని చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చు. అలాగే రిజర్వాయర్ స్థాయిలు, ఇన్ఫ్లోలు, భూగర్భ జలాలు చెరువులకు సంబంధించిన రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో శాటిలైట్ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. అవేర్-2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా విశ్లేషించి మొంథా తుఫాన్ కదలికలను కచ్చితంగా తెలుసుకోగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా సహాయక చర్యలనూ వేగంగా చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా 72 గంటల ముందే తుఫాన్ కదలికల్లో వచ్చిన మార్పులను గుర్తించగలిగారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోగలిగారు, అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలనూ అప్రమత్తం చేయగలిగారు. గాలుల వేగాన్ని అంచనా వేయడంలో కచ్చితమైన సమాచారం రావడంతో ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి అవకాశం లభించింది. దీని ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం.
అలారంలా పని చేసిన అలెర్ట్ మెకానిజం
ఇక వివిధ వ్యవస్థల ద్వారా రియల్ టైములో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. విపత్తులకు సంబంధించిన సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంది. వాస్తవాలను ప్రజలకు నేరుగా చేరవేయగలిగింది.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు, అధికారులకు 1.1 కోట్లకు పైగా సందేశాలను ప్రభుత్వం పంపింది. ఫిర్యాదులు స్వీకరించడం, అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా ప్రత్యేక వ్యవస్థలు పని చేశాయి. మనమిత్ర ద్వారా సుమారు 12,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. ఐవీఆర్ఎస్ సర్వేలు, మీడియా, సామాజిక మాధ్యమ సమీక్షల ద్వారా అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
డ్రోన్లు, సీసీటీవీ, వాహనాల లైవ్ ట్రాకింగ్
ఏరియల్ సర్వేలు, వరద మ్యాపింగ్, రియల్ టైమ్ డేటా సేకరణ కోసం 602 డ్రోన్లను అందుబాటులో ఉంచారు. 14,770 సీసీటీవీ కెమెరాలను ఆర్టీజీఎస్ నెట్వర్క్కు అనుసంధానించారు. 24 గంటల పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేయగలిగారు. అలాగే ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని త్వరగా గుర్తించగలిగారు. ఇక మెషినరీ ట్రాకింగ్ యాప్ ద్వారా జేసీబీలు, క్రేన్లను లైవ్ ట్రాక్ చేయడానికి వీలు కలిగింది.
అలాగే రోడ్బ్లాక్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉన్న చోట జేసీబీలు, క్రేన్లను తరలించేలా చర్యలు తీసుకోగలిగారు. ఇక అన్ని విభాగాల నుంచి వచ్చిన లైవ్ డేటాను అనుసంధానిస్తూ... తుఫాను పర్యవేక్షణ డాష్బోర్డు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా రోడ్లు, ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని సేకరించగలిగారు.
గ్రౌండ్ నెట్ వర్క్... గ్రౌండ్ రియాల్టీ...
5,803 గ్రామ, వార్డు స్థాయిలో కూడా కమాండ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా 2 కోట్లకు పైగా ప్రజలకు సేవలందించే ఏర్పాట్లను ముందుగానే చేసుకోగలిగింది. ఈ క్షేత్ర స్థాయి వ్యవస్థ ద్వారా బ్యాకప్ పవర్, సహాయక సామాగ్రిని ఆయా కేంద్రాల్లో ముందుగానే ఉంచారు. ముఖ్యంగా 1,742 మంది గర్భిణిలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంలో గ్రౌండ్ లెవల్ నెట్ వర్క్ బాగా ఉపయోగపడింది. తుఫాను సమయంలో అన్ని సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ఒక బలమైన సమాచార వ్యవస్థ కొనసాగింది. 2,973 పోర్టబుల్ వైర్లెస్ సెట్లు, డీజీ సెట్లు, వాహనాలకు అమర్చిన రేడియోలతో ఆర్టీజీ సెంటర్ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉంది.
కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం
కేంద్ర సంస్థలతో సమన్వయం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఎండీ, ఎన్డీఎంఏ, ఎంహెచ్ఏలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ సహా ఇతర విభాగాలు పని చేశాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరులోని సంగం బ్యారేజ్ సమీపంలో చిక్కుకున్న పడవను చాకచక్యంగా లాగడం వంటి క్లిష్టమైన రెస్క్యూ మిషన్లను చేపట్టాయి. భారతదేశంలో మొట్టమొదటిదైన ఎన్డీఎంఏ సెల్ బ్రాడ్కాస్ట్ వైబ్రేషనల్ అలర్ట్ సేవను మన రాష్ట్రం వినియోగించుకుంది. విద్యుత్ శాఖ ఫీడర్లు, సబ్స్టేషన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. ఉపగ్రహ చిత్రాల సహాయంతో ముంపు నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా పూర్తి స్థాయి సాంకేతికతతో ప్రభుత్వం మొంథా తుఫాను సహాయక చర్యలను చేపట్టింది. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల ద్వారా నష్ట నివారణా చర్యలు చేప్టటడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది.
రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తూనే సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రియల్ టైమ్ డేటాను అప్డేట్ చేసుకుంటూ, వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ, రియల్ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా పని చేశారు. డేటా ఆధారిత విపత్తు నిర్వహణ నమూనాను ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, టెక్నాలజీని అనుసంధానించి రియల్ టైమ్లో సమన్వయం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, అవి అమలు అయ్యేలా చూడటంలో ఈ నమూనా విజయం సాధించింది. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంతోపాటు వివిధ శాఖల నుంచి ఆర్టీజీఎస్ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని అనుసంధానించి AWARE 2.0 వ్యవస్థ ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం.
సాంకేతికత ద్వారా మొంథా తుఫాను సహాయక చర్యలను ఏ విధంగా పర్యవేక్షించారనే వివరాలను ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి తొమ్మిదిసార్లు టెలీ కాన్ఫరెన్సులు, ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ విభాగాలు, క్షేత్ర స్థాయి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన సమాచారంతో, అవసరమైన ప్రాంతాలకు సహయక చర్యలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసేలా ప్రభుత్వం సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించింది. అవసరమైన చోట యంత్ర పరికరాలను, మానవ వనరులను సమర్థంగా కేటాయించడంలోనూ సాంకేతికత సహాయపడింది.
టెక్నాలజీ వనరుగా – AWARE 2.0
AWARE 2.0 వ్యవస్థకు స్టేట్ డేటాలేక్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా రియల్ టైములో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. వర్షపాతం, గాలి, పిడుగుల వంటి వాటిపై హెచ్చరికలు జారీ చేసేలా అవేర్-2.0 వ్యవస్థ పని చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చు. అలాగే రిజర్వాయర్ స్థాయిలు, ఇన్ఫ్లోలు, భూగర్భ జలాలు చెరువులకు సంబంధించిన రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో శాటిలైట్ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. అవేర్-2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా విశ్లేషించి మొంథా తుఫాన్ కదలికలను కచ్చితంగా తెలుసుకోగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా సహాయక చర్యలనూ వేగంగా చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా 72 గంటల ముందే తుఫాన్ కదలికల్లో వచ్చిన మార్పులను గుర్తించగలిగారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోగలిగారు, అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలనూ అప్రమత్తం చేయగలిగారు. గాలుల వేగాన్ని అంచనా వేయడంలో కచ్చితమైన సమాచారం రావడంతో ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి అవకాశం లభించింది. దీని ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం.
అలారంలా పని చేసిన అలెర్ట్ మెకానిజం
ఇక వివిధ వ్యవస్థల ద్వారా రియల్ టైములో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. విపత్తులకు సంబంధించిన సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంది. వాస్తవాలను ప్రజలకు నేరుగా చేరవేయగలిగింది.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు, అధికారులకు 1.1 కోట్లకు పైగా సందేశాలను ప్రభుత్వం పంపింది. ఫిర్యాదులు స్వీకరించడం, అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా ప్రత్యేక వ్యవస్థలు పని చేశాయి. మనమిత్ర ద్వారా సుమారు 12,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. ఐవీఆర్ఎస్ సర్వేలు, మీడియా, సామాజిక మాధ్యమ సమీక్షల ద్వారా అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
డ్రోన్లు, సీసీటీవీ, వాహనాల లైవ్ ట్రాకింగ్
ఏరియల్ సర్వేలు, వరద మ్యాపింగ్, రియల్ టైమ్ డేటా సేకరణ కోసం 602 డ్రోన్లను అందుబాటులో ఉంచారు. 14,770 సీసీటీవీ కెమెరాలను ఆర్టీజీఎస్ నెట్వర్క్కు అనుసంధానించారు. 24 గంటల పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేయగలిగారు. అలాగే ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని త్వరగా గుర్తించగలిగారు. ఇక మెషినరీ ట్రాకింగ్ యాప్ ద్వారా జేసీబీలు, క్రేన్లను లైవ్ ట్రాక్ చేయడానికి వీలు కలిగింది.
అలాగే రోడ్బ్లాక్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉన్న చోట జేసీబీలు, క్రేన్లను తరలించేలా చర్యలు తీసుకోగలిగారు. ఇక అన్ని విభాగాల నుంచి వచ్చిన లైవ్ డేటాను అనుసంధానిస్తూ... తుఫాను పర్యవేక్షణ డాష్బోర్డు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా రోడ్లు, ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని సేకరించగలిగారు.
గ్రౌండ్ నెట్ వర్క్... గ్రౌండ్ రియాల్టీ...
5,803 గ్రామ, వార్డు స్థాయిలో కూడా కమాండ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా 2 కోట్లకు పైగా ప్రజలకు సేవలందించే ఏర్పాట్లను ముందుగానే చేసుకోగలిగింది. ఈ క్షేత్ర స్థాయి వ్యవస్థ ద్వారా బ్యాకప్ పవర్, సహాయక సామాగ్రిని ఆయా కేంద్రాల్లో ముందుగానే ఉంచారు. ముఖ్యంగా 1,742 మంది గర్భిణిలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంలో గ్రౌండ్ లెవల్ నెట్ వర్క్ బాగా ఉపయోగపడింది. తుఫాను సమయంలో అన్ని సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ఒక బలమైన సమాచార వ్యవస్థ కొనసాగింది. 2,973 పోర్టబుల్ వైర్లెస్ సెట్లు, డీజీ సెట్లు, వాహనాలకు అమర్చిన రేడియోలతో ఆర్టీజీ సెంటర్ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉంది.
కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం
కేంద్ర సంస్థలతో సమన్వయం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఎండీ, ఎన్డీఎంఏ, ఎంహెచ్ఏలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ సహా ఇతర విభాగాలు పని చేశాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరులోని సంగం బ్యారేజ్ సమీపంలో చిక్కుకున్న పడవను చాకచక్యంగా లాగడం వంటి క్లిష్టమైన రెస్క్యూ మిషన్లను చేపట్టాయి. భారతదేశంలో మొట్టమొదటిదైన ఎన్డీఎంఏ సెల్ బ్రాడ్కాస్ట్ వైబ్రేషనల్ అలర్ట్ సేవను మన రాష్ట్రం వినియోగించుకుంది. విద్యుత్ శాఖ ఫీడర్లు, సబ్స్టేషన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. ఉపగ్రహ చిత్రాల సహాయంతో ముంపు నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా పూర్తి స్థాయి సాంకేతికతతో ప్రభుత్వం మొంథా తుఫాను సహాయక చర్యలను చేపట్టింది. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల ద్వారా నష్ట నివారణా చర్యలు చేప్టటడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది.