Prabhu Actor: నటుడు ప్రభు ఇంటికి, అమెరికా కాన్సులేట్కు బాంబు బెదిరింపు
- డీజీపీ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్
- రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్
- ఆకతాయిల పనేనని నిర్ధారించిన పోలీసులు
చెన్నైలో మరోసారి కలకలం రేగింది. ప్రముఖ నటుడు ప్రభు నివాసంతో పాటు, అమెరికా రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్తో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్లో ఈ బెదిరింపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా కాన్సులేట్లో, ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో బాంబు పేలుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే చెన్నై పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్తో రంగంలోకి దిగారు.
అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి క్షుణ్ణంగా గాలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో అమెరికా కాన్సులేట్లో పనిచేసే మరికొందరు అధికారులతో పాటు, నటుడు ఎస్.వి. శేఖర్, మైలాపూర్లోని సుబ్రమణ్యస్వామి నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.
అయితే, అన్ని చోట్లా తనిఖీలు పూర్తి చేసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇది కేవలం ఆకతాయిల చర్యగా భావిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ వరుస బెదిరింపులతో కొద్దిసేపు నగరంలో తీవ్ర ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్లో ఈ బెదిరింపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా కాన్సులేట్లో, ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో బాంబు పేలుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే చెన్నై పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్తో రంగంలోకి దిగారు.
అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి క్షుణ్ణంగా గాలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో అమెరికా కాన్సులేట్లో పనిచేసే మరికొందరు అధికారులతో పాటు, నటుడు ఎస్.వి. శేఖర్, మైలాపూర్లోని సుబ్రమణ్యస్వామి నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.
అయితే, అన్ని చోట్లా తనిఖీలు పూర్తి చేసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇది కేవలం ఆకతాయిల చర్యగా భావిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ వరుస బెదిరింపులతో కొద్దిసేపు నగరంలో తీవ్ర ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.