Gas Cylinder Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ కావాలా?.. అయితే, ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి!
- ఉజ్వల లబ్ధిదారులు ఏటా మార్చి 31 లోపు ఈ-కేవైసీ చేయాలి
- గడువులోగా పూర్తిచేయకపోతే సబ్సిడీ శాశ్వతంగా రద్దు
- రాష్ట్రంలో 1.5 కోట్ల వినియోగదారుల్లో 60 శాతమే పూర్తి
- మొబైల్ యాప్, ఏజెన్సీ, డెలివరీ సిబ్బంది ద్వారా కేవైసీకి అవకాశం
- కేవైసీ పూర్తిచేయించని డీలర్లకు జరిమానాలు విధిస్తామని కంపెనీల హెచ్చరిక
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన విధించింది. గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ వాడే వినియోగదారులు సబ్సిడీ ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ ఈ-కేవైసీని పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా ఈ-కేవైసీ చేయని వారికి సబ్సిడీని నిలిపివేయడమే కాకుండా, ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీని శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఈ ఆదేశాల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) వంటి ఆయిల్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు లక్ష్యాలు నిర్దేశించి ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది గృహ గ్యాస్ వినియోగదారులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తిచేశారు. సబ్సిడీ నిలిచిపోయినా, గ్యాస్ సిలిండర్ల సరఫరా లేదా రీఫిల్ బుకింగ్కు ఎలాంటి ఆటంకం ఉండదని, కాకపోతే వినియోగదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీలు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
వినియోగదారుల స్పందన కరువు
వినియోగదారుల సౌలభ్యం కోసం పలు మార్గాల్లో ఈ-కేవైసీ పూర్తిచేసే అవకాశం కల్పించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మొబైల్ యాప్ ద్వారా, సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి లేదా సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద కూడా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయినప్పటికీ, వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని పంపిణీదారులు చెబుతున్నారు.
మరోవైపు, తమ పరిధిలోని వినియోగదారులతో ఈ-కేవైసీ పూర్తి చేయించకపోతే జరిమానాలు విధిస్తామని ఆయిల్ కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై అఖిల భారత గ్యాస్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. "వినియోగదారులతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు పంపిణీదారులపై ఒత్తిడి తేవడం సరైన చర్య కాదు" అని అన్నారు. సబ్సిడీ ప్రయోజనాలను నిరంతరాయంగా పొందాలంటే వినియోగదారులు గడువులోగా ఈ-కేవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి.
ఈ ఆదేశాల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) వంటి ఆయిల్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు లక్ష్యాలు నిర్దేశించి ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది గృహ గ్యాస్ వినియోగదారులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తిచేశారు. సబ్సిడీ నిలిచిపోయినా, గ్యాస్ సిలిండర్ల సరఫరా లేదా రీఫిల్ బుకింగ్కు ఎలాంటి ఆటంకం ఉండదని, కాకపోతే వినియోగదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీలు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
వినియోగదారుల స్పందన కరువు
వినియోగదారుల సౌలభ్యం కోసం పలు మార్గాల్లో ఈ-కేవైసీ పూర్తిచేసే అవకాశం కల్పించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మొబైల్ యాప్ ద్వారా, సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి లేదా సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద కూడా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయినప్పటికీ, వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని పంపిణీదారులు చెబుతున్నారు.
మరోవైపు, తమ పరిధిలోని వినియోగదారులతో ఈ-కేవైసీ పూర్తి చేయించకపోతే జరిమానాలు విధిస్తామని ఆయిల్ కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై అఖిల భారత గ్యాస్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. "వినియోగదారులతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు పంపిణీదారులపై ఒత్తిడి తేవడం సరైన చర్య కాదు" అని అన్నారు. సబ్సిడీ ప్రయోజనాలను నిరంతరాయంగా పొందాలంటే వినియోగదారులు గడువులోగా ఈ-కేవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి.