Cyclone Montha: తుపాన్ ఎఫెక్ట్ తో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీల బంద్.. 31 వరకు సెలవులు

Kakinada Schools Closed Until 31st Due to Cyclone Montha Threat
  • కాకినాడ వద్ద తీరం దాటనున్న మొంథా తుపాన్
  • తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు
  • తుపాన్ ప్రభావంతో కాకినాడలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌ ను మొంథా తుపాన్ వణికిస్తోంది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మొంథా తుపాన్ గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 360 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ దగ్గర ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీవ్ర తుపాన్‌ గా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఈ నెల 31 వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసేయాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు, రేపు విద్యాసంస్థలకు అధికారులు సెలువులు ప్రకటించారు. వర్షాల పరిస్థితిని గమనించి సెలవులు పొడిగించాలా లేదా అని నిర్ణయం తీసుకుంటారు.
Cyclone Montha
Montha Cyclone
Kakinada
Andhra Pradesh
Cyclone Alert
School Holiday
College Holiday
Heavy Rains
Weather Forecast
Cyclone Update

More Telugu News