Tejashwi Yadav: కాంగ్రెస్కు షాకిచ్చిన తేజస్వి.. ఏకపక్షంగా 143 మంది అభ్యర్థుల ప్రకటన
- బీహార్ ‘మహాఘట్ బంధన్’లో సీట్ల సర్దుబాటు పూర్తికాకముందే ఆర్జేడీ జాబితా
- ఏకంగా 143 మంది అభ్యర్థులను ప్రకటించిన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ
- రాఘోపుర్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న తేజస్వీ యాదవ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న వేళ, విపక్ష ‘మహాఘట్ బంధన్’ కూటమిలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాకముందే, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఏకపక్షంగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి రాజకీయంగా కలకలం రేపింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్గా మారింది.
ఈరోజు ఆర్జేడీ ఏకంగా 143 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, వైశాలి జిల్లాలోని రాఘోపుర్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుండగా, ఆర్జేడీ ఈ జాబితాను విడుదల చేయడం కూటమిలో సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్కు నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 17నే ముగిసింది.
కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య పెరిగిన దూరమే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విభేదాల కారణంగానే కూటమి తరఫున ఇప్పటివరకు అధికారికంగా సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా, తొలి విడతలో పోలింగ్ జరగనున్న 121 స్థానాలకు గాను, కూటమి పార్టీలు కలిసి ఏకంగా 125 మంది అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బీహార్లో నవంబరు 6, 11 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికలకు ముందు కూటమిలో నెలకొన్న ఈ అనిశ్చితి, ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈరోజు ఆర్జేడీ ఏకంగా 143 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, వైశాలి జిల్లాలోని రాఘోపుర్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుండగా, ఆర్జేడీ ఈ జాబితాను విడుదల చేయడం కూటమిలో సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్కు నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 17నే ముగిసింది.
కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య పెరిగిన దూరమే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విభేదాల కారణంగానే కూటమి తరఫున ఇప్పటివరకు అధికారికంగా సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా, తొలి విడతలో పోలింగ్ జరగనున్న 121 స్థానాలకు గాను, కూటమి పార్టీలు కలిసి ఏకంగా 125 మంది అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బీహార్లో నవంబరు 6, 11 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికలకు ముందు కూటమిలో నెలకొన్న ఈ అనిశ్చితి, ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.