మాగంటి సునీతకు బీ ఫామ్, రూ.40 లక్షల చెక్కును అందజేసిన కేసీఆర్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సునీత
- ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 40 లక్షల చెక్కు అందజేత
- కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తమ పార్టీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. జూబ్లీహిల్స్లో నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.