Nara Lokesh: విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి... నగరం రూపురేఖలు మార్చాలి: మంత్రి నారా లోకేశ్
- ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక సమీక్ష
- విశాఖ రీజియన్కు భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడి
- 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
- 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు
- ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని సూచన
- ఐటీ పార్కుల కోసం అనువైన భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశం
రానున్న రోజుల్లో విశాఖపట్నం రీజియన్ భారీ ఎత్తున పెట్టుబడులకు కేంద్రంగా మారనుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, రాబోయే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఒక పటిష్టమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "విశాఖ ప్రాంతానికి పెద్ద ఎత్తున కంపెనీలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం యొక్క రూపురేఖలు మార్చేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. బెంగళూరు, పుణె వంటి నగరాలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు భవిష్యత్తులో విశాఖలో తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. దీనికోసం విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి" అని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపడుతోందని, రాబోయే అతిపెద్ద స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర కంపెనీల ఏర్పాటు ద్వారా సుమారు 5 లక్షల ఉద్యోగాలు స్థానిక యువతకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మేధోపరమైన చర్చల ద్వారా నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ఆమోదంతో 'మిషన్ మోడ్'లో జరగాలని స్పష్టం చేశారు. నగరంలో కొత్త ఐటీ పార్కుల ఏర్పాటుకు అనువైన ల్యాండ్ బ్యాంకులను వెంటనే గుర్తించి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, శాసనసభ విప్ గణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, వీఎంఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "విశాఖ ప్రాంతానికి పెద్ద ఎత్తున కంపెనీలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం యొక్క రూపురేఖలు మార్చేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. బెంగళూరు, పుణె వంటి నగరాలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు భవిష్యత్తులో విశాఖలో తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. దీనికోసం విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి" అని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపడుతోందని, రాబోయే అతిపెద్ద స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర కంపెనీల ఏర్పాటు ద్వారా సుమారు 5 లక్షల ఉద్యోగాలు స్థానిక యువతకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మేధోపరమైన చర్చల ద్వారా నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ఆమోదంతో 'మిషన్ మోడ్'లో జరగాలని స్పష్టం చేశారు. నగరంలో కొత్త ఐటీ పార్కుల ఏర్పాటుకు అనువైన ల్యాండ్ బ్యాంకులను వెంటనే గుర్తించి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, శాసనసభ విప్ గణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, వీఎంఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.