: హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్.. రూ.70 కోట్ల విలువైన ఎపిడ్రిన్ సీజ్
- రూ.70 కోట్ల విలువైన 220 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం
- ఫార్మా కంపెనీలోనే మత్తుమందుల తయారీకి ఒప్పందం
- పాత నేరస్థుడితో కలిసి యజమానుల భాగస్వామ్యం
- జీడిమెట్లలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ రాకెట్ను ఈగల్ బృందాలు ఛేదించాయి. అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందును తయారుచేస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశాయి. జీడిమెట్లలో గురువారం జరిపిన ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.70 కోట్ల విలువైన 220 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కాకినాడకు చెందిన వత్సవాయి శివరామ కృష్ణ పరమావర్మ అని, అతడికి గతంలోనూ మత్తుమందుల కేసుల్లో నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. తన పాత మిత్రుడైన అనిల్తో కలిసి గతేడాది ఈ డ్రగ్స్ తయారీకి పథకం రచించాడు. వీరిద్దరికీ కెమికల్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉండటంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ దందాకు తెరలేపారు.
అనిల్ పనిచేస్తున్న దూలపల్లిలోని ‘పీఎన్ఎం లైఫ్ సైన్సెస్’ సంస్థను మత్తుమందుల తయారీకి అడ్డాగా మార్చుకున్నారు. మంచి కమీషన్ ఇస్తామని ఆశ చూపడంతో, ఆ కంపెనీ యజమానులైన వెంకటకృష్ణ, ప్రసాద్ కూడా వీరితో చేతులు కలిపారు. వర్మ ఇచ్చిన ఫార్ములా ఆధారంగా అనిల్ ఏకంగా 220 కిలోల ఎపిడ్రిన్ను కంపెనీలోనే తయారుచేశాడు.
గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి బెయిల్పై బయటకు వచ్చిన వారి కదలికలపై ఈగల్ బృందాలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలో వర్మ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని వెంబడించారు. తయారు చేసిన డ్రగ్ను ఎలా విక్రయించాలనే విషయంపై జీడిమెట్లలోని వర్మ ఇంట్లో సమావేశం కాగా, పోలీసులు దాడి చేసి ముఠా సభ్యులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ కేసులో వర్మ, అనిల్, కంపెనీ యజమాని వెంకటకృష్ణ, ప్రొడక్షన్ వర్కర్ దొరబాబును అరెస్ట్ చేసినట్టు సందీప్ శాండిల్య తెలిపారు. మరో యజమాని ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని ఆయన వివరించారు. కాగా, దేశీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కాకినాడకు చెందిన వత్సవాయి శివరామ కృష్ణ పరమావర్మ అని, అతడికి గతంలోనూ మత్తుమందుల కేసుల్లో నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. తన పాత మిత్రుడైన అనిల్తో కలిసి గతేడాది ఈ డ్రగ్స్ తయారీకి పథకం రచించాడు. వీరిద్దరికీ కెమికల్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉండటంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ దందాకు తెరలేపారు.
అనిల్ పనిచేస్తున్న దూలపల్లిలోని ‘పీఎన్ఎం లైఫ్ సైన్సెస్’ సంస్థను మత్తుమందుల తయారీకి అడ్డాగా మార్చుకున్నారు. మంచి కమీషన్ ఇస్తామని ఆశ చూపడంతో, ఆ కంపెనీ యజమానులైన వెంకటకృష్ణ, ప్రసాద్ కూడా వీరితో చేతులు కలిపారు. వర్మ ఇచ్చిన ఫార్ములా ఆధారంగా అనిల్ ఏకంగా 220 కిలోల ఎపిడ్రిన్ను కంపెనీలోనే తయారుచేశాడు.
గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి బెయిల్పై బయటకు వచ్చిన వారి కదలికలపై ఈగల్ బృందాలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలో వర్మ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని వెంబడించారు. తయారు చేసిన డ్రగ్ను ఎలా విక్రయించాలనే విషయంపై జీడిమెట్లలోని వర్మ ఇంట్లో సమావేశం కాగా, పోలీసులు దాడి చేసి ముఠా సభ్యులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ కేసులో వర్మ, అనిల్, కంపెనీ యజమాని వెంకటకృష్ణ, ప్రొడక్షన్ వర్కర్ దొరబాబును అరెస్ట్ చేసినట్టు సందీప్ శాండిల్య తెలిపారు. మరో యజమాని ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని ఆయన వివరించారు. కాగా, దేశీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.