BCCI: బీసీసీఐ జట్టును 'భారత జట్టు' అని పిలవడంపై పిటిషన్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు
- టీమిండియా’ పేరుపై వివాదం
- ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
- కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని హితవు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలోని జట్టును 'భారత జాతీయ క్రికెట్ జట్టు'గా పిలవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఇలాంటి వాటితో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని హితవు పలికింది.
ప్రభుత్వ ఆధీనంలోని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వంటి ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును 'టీమిండియా'గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది రీపక్ కన్సల్ ఈ పిల్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం పిటిషనర్పై ప్రశ్నల వర్షం కురిపించింది.
"ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న ఆ జట్టు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదని మీరు చెబుతున్నారా? బీసీసీఐని పక్కనపెట్టండి... దూరదర్శన్ లేదా మరేదైనా సంస్థ ఆ జట్టును టీమిండియాగా చూపిస్తే, అది భారత జట్టు కాకుండా పోతుందా?" అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం ఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసా అని కూడా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ వ్యాజ్యం విచారణకు స్వీకరించడం పూర్తిగా సమయం వృథా చేయడమేనని అభిప్రాయపడింది. "ఇకపై మంచి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయండి" అని పిటిషనర్కు సూచిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
పిటిషనర్ వాదన ఏమిటి?
బీసీసీఐ అనేది తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం అది 'ప్రభుత్వ' పరిధిలోకి రాదని పిటిషనర్ తన వ్యాజ్యంలో వాదించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా బీసీసీఐని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తించలేదని, ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు.
అయినప్పటికీ, ప్రభుత్వ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును 'టీమిండియా' అని, 'భారత జాతీయ జట్టు' అని సంబోధిస్తూ జాతీయ జెండాను ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఒక ప్రైవేట్ సంస్థకు అనవసరమైన వాణిజ్య ప్రయోజనం చేకూరుస్తుందని పిటిషన్లో వివరించారు. ఈ చర్యలు చిహ్నాలు, పేర్ల (అక్రమ వినియోగ నిరోధక) చట్టం-1950, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002ను ఉల్లంఘించడమేనని తెలిపారు.
ప్రభుత్వ ఆధీనంలోని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వంటి ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును 'టీమిండియా'గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది రీపక్ కన్సల్ ఈ పిల్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం పిటిషనర్పై ప్రశ్నల వర్షం కురిపించింది.
"ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న ఆ జట్టు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదని మీరు చెబుతున్నారా? బీసీసీఐని పక్కనపెట్టండి... దూరదర్శన్ లేదా మరేదైనా సంస్థ ఆ జట్టును టీమిండియాగా చూపిస్తే, అది భారత జట్టు కాకుండా పోతుందా?" అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం ఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసా అని కూడా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ వ్యాజ్యం విచారణకు స్వీకరించడం పూర్తిగా సమయం వృథా చేయడమేనని అభిప్రాయపడింది. "ఇకపై మంచి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయండి" అని పిటిషనర్కు సూచిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
పిటిషనర్ వాదన ఏమిటి?
బీసీసీఐ అనేది తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం అది 'ప్రభుత్వ' పరిధిలోకి రాదని పిటిషనర్ తన వ్యాజ్యంలో వాదించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా బీసీసీఐని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తించలేదని, ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు.
అయినప్పటికీ, ప్రభుత్వ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును 'టీమిండియా' అని, 'భారత జాతీయ జట్టు' అని సంబోధిస్తూ జాతీయ జెండాను ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఒక ప్రైవేట్ సంస్థకు అనవసరమైన వాణిజ్య ప్రయోజనం చేకూరుస్తుందని పిటిషన్లో వివరించారు. ఈ చర్యలు చిహ్నాలు, పేర్ల (అక్రమ వినియోగ నిరోధక) చట్టం-1950, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002ను ఉల్లంఘించడమేనని తెలిపారు.